Montha Cyclone Effect: తీరాన్ని తాకిన ‘మొంథా’ తుఫాన్.. అక్కడ 8:30 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Montha Cyclone Effect: అందిన సమాచారం మేరకు ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 3-4 గంటలు అత్యంత కీలకం కానుంది. తుఫాను తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులతో కలిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ‘మొంథా’ తుఫాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
Movie Tickets Rates : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్..?
Also Read
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ ప్రభావిత ఏడు జిల్లాల్లో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఈ ఏడు జిల్లాల పరిధిలోని జాతీయ రహదారులతో సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. వాహనాల నిలిపివేత ఆంక్షల నుంచి కేవలం అత్యవసర వైద్య సేవలు (Emergency Medical Services) కోసం వెళ్లే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన వాహనాలు ఏవీ ఈ సమయంలో రోడ్లపైకి రావడానికి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల్లోని ప్రజలంతా తప్పనిసరిగా తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షపాతం కారణంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండటం అత్యవసరం.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!