Khammam Crime: భూమి కోసం కూల్ డ్రింక్లో విషం కలిపి అక్కను చంపిన తమ్ముడు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి..
- ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతి
- సాధారణ మరణం కాదని బంధువులు అనుమానం
- తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపాడని ఫిర్యాదు
- ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా గుర్తింపు
Khammam Crime: మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో కొన్ని ఘటనలు చూస్తుంటే అర్థం కావడం లేదు.. ఆస్తుల కోసం, భూముల కోసం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా కాటికి పంపిస్తున్నారు కొందరు దుర్మార్గులు.. తాజాగా, అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపిన తమ్ముడి ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది..
Read Also: EPFO: ఆధార్ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు
Also Read
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతిచెందగా.. ఆమెది సాధారణ మరణం కాదని బంధువులు అనుమానించారు. తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపాడని ఆరోపిస్తూ ఆమె అన్నలు కోమటి నాగేశ్వరరావు, కోమటి ముత్తయ్యలు వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టటంతో సోమవారం వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా తేలింది.. దీంతో.. సత్తుపల్లి రూరల్ సీఐ వెంకటేష్ ఆద్వర్యంలో.. నిందితుడు కోమటి వెంకటేశ్వరరావు పై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి.. సత్తుపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఇక, నిందితుడికి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు.. ఆ తర్వాత సత్తుపల్లి సబ్ జైల్కు తరలించారు.. మూడు సంవత్సరాల తరువాత హత్య కేసులో ఫారెన్సీక్ నివేదిక ఆధారంగా నిందితుడుని పోలీస్ లు రిమాండ్ కు తరలించారు పోలీసులు..
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!