Khammam Crime: భూమి కోసం కూల్ డ్రింక్లో విషం కలిపి అక్కను చంపిన తమ్ముడు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి..
- ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతి
- సాధారణ మరణం కాదని బంధువులు అనుమానం
- తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపాడని ఫిర్యాదు
- ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Crime: మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో కొన్ని ఘటనలు చూస్తుంటే అర్థం కావడం లేదు.. ఆస్తుల కోసం, భూముల కోసం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా కాటికి పంపిస్తున్నారు కొందరు దుర్మార్గులు.. తాజాగా, అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపిన తమ్ముడి ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది..
Read Also: EPFO: ఆధార్ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతిచెందగా.. ఆమెది సాధారణ మరణం కాదని బంధువులు అనుమానించారు. తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపాడని ఆరోపిస్తూ ఆమె అన్నలు కోమటి నాగేశ్వరరావు, కోమటి ముత్తయ్యలు వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టటంతో సోమవారం వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా తేలింది.. దీంతో.. సత్తుపల్లి రూరల్ సీఐ వెంకటేష్ ఆద్వర్యంలో.. నిందితుడు కోమటి వెంకటేశ్వరరావు పై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి.. సత్తుపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఇక, నిందితుడికి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు.. ఆ తర్వాత సత్తుపల్లి సబ్ జైల్కు తరలించారు.. మూడు సంవత్సరాల తరువాత హత్య కేసులో ఫారెన్సీక్ నివేదిక ఆధారంగా నిందితుడుని పోలీస్ లు రిమాండ్ కు తరలించారు పోలీసులు..
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!