Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- నగరాన్ని బందీ చేయడం అవసరమా అంటూ ప్రశ్న..
- ఇప్పటికే సుప్రీంకోర్టులో జంతర్ మంతర్ నిరసన స్థలంపై పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగరం నడిబొడ్డున నిరసనలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, మొత్తం ఢిల్లీని బందీగా ఎందుకు మార్చాలి.? అని ప్రశ్నించింది. జస్టిస్ అమిత్ మహాజన్, ‘‘ వ్యక్తిగతంగా చూస్తే నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే’’ అని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ పోలీసుల పరిధిలో ఉంటుందని, అనుమతిపై తాము ఆదేశాలు ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ దరఖాస్తుపై శనివారం లోగా నిర్ణయం తీసుకని, ఈ విషయాన్ని తెలియజేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.
కేసు ఏమిటి..?
ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆగస్టు 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసుల్ని అనుమతి కోరింది. జూలై 9 నుంచి అనుమతి రాకపోవడంతో వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్రం తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని తమ డిమాండ్కు మద్దతుగా ఈ నిరసన చేపట్టాలని భావిస్తోంది.
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టుకు చేరిన జంతర్ మంతర్ అంశం:
మరోవైపు, జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆగస్టు 3న సుప్రీంకోర్టు కూడా జంతర్ మంతర్ను నిరసనలు జరిపే ప్రాంతంగా ఉంచాలా వద్దా అనే దానిపై దాఖలైన పిల్ దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నిరసనల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, అత్యవసర సేవలకు ఆటంకం వాటిల్లుతోందని పిటిషన్ పేర్కొంది.
తాజావార్తలు
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?