Waqf bill: ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.. వక్ఫ్ బిల్లుని ఆపేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చీఫ్..
- వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ప్రాణాలైనా అర్పిస్తాం..
- దేశంలో ముస్లింలు జైళ్లను నింపుతారు..
- ముస్లిం లా బోర్డ్ చీఫ్ సైఫుల్లా హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf bill: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకువచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో మరోసారి సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాగైనా వక్ఫ్ అమలుని నిలిపేస్తామని, దాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు’’ అని అన్నారు. కాన్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనేక వక్ఫ్ ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించిందని వ్యాఖ్యానించారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
‘‘ఇది మాకు జీవన్మరణ సమస్య, మేము దానిని (వక్ఫ్ బిల్లు) ఎంతకైనా ఆపాలి, అవసరమైతే, దేశంలోని ముస్లింలు ప్రభుత్వానికి చోటు లేని విధంగా జైళ్లను నింపుతారు. ’’ అని హెచ్చరించారు. అవసరమైతే మా ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనుకాడబోమని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రం జూలై 28న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల అభ్యంతరంతో జేపీసీ ఏర్పాటైంది. ఏదైనా ఆస్తిని ‘‘వక్ఫ్ ఆస్తి’’గా పేర్కొనే వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కళ్లెం వేయడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిం మహిళలు, ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది.
ముస్లిమేతరులను చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సైఫుల్లా, ముస్లింల నుంచి వక్ఫ్ భూములు లాక్కోవడమే ప్రభుత్వం లక్ష్యమని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో ముస్లిమేతరులు చూసుకుంటే, వారు మసీదులు, శ్మశాన వాటికలపై సానుభూతి చూపుతారా..? ఫలితంగా మీ నుంచి మీ భూమి లాక్కోబడుతుందని, ఇది ప్రమాదకరమైన చట్టమని అన్నారు. ‘‘తమిళనాడులోనే 4,78,000 ఎకరాల ఆలయ భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4,68,000 ఎకరాల ఆలయ భూమి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 10 లక్షల ఎకరాల దేవాలయాల భూమి ఉంది. ముస్లింలకు ఆరు లక్షల ఎకరాలు ఉంటే సమస్యేంటి..?’’ అని సైఫుల్లా అన్నారు. వక్ఫ్ బోర్డుకు, ప్రభుత్వానికి మధ్య వివాదం వస్తే కలెక్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాడా..? అని ప్రశ్నించాడు.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!