కరోనా కేసులు కేరళలో ఎందుకు కంట్రోల్ కావడంలేదు… ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు 30 వేల నుంచి 40 వేల వరకూ నమోదవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్లోకి వచ్చినా, కేరళ రాష్ట్రంలో మాత్రం అదుపులోకి రావడంలేదు. పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పాజిటివిటీ శాతం 5 శాతం కంటే తక్కువుగా నమోదవుతుంటే, కేరళలో మాత్రం 10 నుంచి 15 శాతం వరకు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మొదటి వేవ్ సమయంలో కరోనాను కట్టడి చేయడంలో కేరళ సఫలం అయింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం కేరళ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించింది.
Read: పద్మా పాటిల్ : ‘హ్యారీ పాటర్’లో అమ్మాయి… ఇప్పుడు అమ్మ!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అయితే, సెకండ్ వేవ్ సమయంలో ఇది పూర్తిగా తలక్రిందులైంది. సెకండ్ వేవ్ తో వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు ఆ తరువాత ఆ తరువాత కరోనా నుంచి మెల్లిగా కోలుకున్నాయి. కరోనాపై పోరాటం చేసి విజయం సాధించాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కంట్రోల్లోకి రావడంలేదు. రోజువారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కేరళ రాష్ట్రంలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే, టెస్టుల సంఖ్య పెంచామని అందుకే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నది. కేరళలో వ్యాక్సిన్ను వేగంగా అమలు చేస్తున్నా, పాజిటివిటీ శాతం తగ్గకపోవడం విశేషం.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?