Adani bribery case: అదానీ లంచం కేసుపై వైట్హౌస్ రియాక్షన్..
- గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు..
- వీటిపై ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుంది..
- ఈ కేసును భారత్- యూఎస్ అధిగమిస్తాయనే విశ్వాసం ఉంది: వైట్ హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani bribery case: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి యూఎస్ లో నిధులు సేకరించారని అదానీ సహా మరో 7 మందిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం రియాక్ట్ అయింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
కాగా, వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తాము అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకున్నాం.. మిగతా సమస్యల మాదిరిగానే ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు పరిష్కరిస్తాయని కరీన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: USA-Russia: అమెరికాపై రష్యా దాడులు చేసే ఛాన్స్.. యూఎస్ ఇంటెలిజెన్స్ అలర్ట్!
అయితే, అమెరికాలో నిధులు సేకరించేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అదానీతో పాటు మరో 7 మందిపై కేసు ఫైల్ అయింది. కాగా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద వీరందరికి హెల్ప్ చేసిన మరో ఐదుగురిపైనా కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీపైనా న్యూయార్క్ అరెస్ట్ వారంట్లు జారీ చేసినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!