West Bengal: బెంగాల్ల్లో హత్యారాజకీయం.. పంచాయతీ పోలింగ్ రోజే ఏడుగురి హత్య..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బెంగాల్ లోని మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతున్నా.. హింసకు అడ్డుకట్టపడటం లేదు.
Read Also: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..
Also Read
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురి హత్య జరిగింది. నలుగురు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు చనిపోగా.. కూచ్ బెహార్ లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ని కాల్చి చంపారు. మరో సంఘటనలో సీపీఎం కార్యకర్త కోల్కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మల్దా జిల్లాలో ఒక టీఎంసీ కార్యకర్త బాంబు దాడిలో మరణించాడు. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, 24 పరగణ జిల్లాల్లో కూడా హింస చెలరేగింది. రిజినగర్, తుఫాన్ గంజ్, కాగ్రమ్ ప్రాంతాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కాల్చి చంపబడ్డారు. 24 పరగణ జిల్లాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బూల్ ఏజెంట్ చంపబడ్డాడు. ఈ హత్య వెనక టీఎంసీ అభ్యర్థి మున్నా బిబి ఉన్నట్లు ప్రజలు ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీజేపీతో పాటు సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీల మధ్య తీవ్ర హింస చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ రోజు మరణాలకు ముందు 12 పైగా మంది కార్యకర్తలు పలు జిల్లాల్లో జరిగిన దాడుల్లో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 20కి పైగా చేరాయి. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివీ ఆనంద్ బోస్ పంచాయతీ ఎన్నికలను పరిశీలించేందుకు 24 పరగణ జిల్లాకు వెళ్లారు.
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!