West Bengal: బెంగాల్ల్లో హత్యారాజకీయం.. పంచాయతీ పోలింగ్ రోజే ఏడుగురి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బెంగాల్ లోని మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతున్నా.. హింసకు అడ్డుకట్టపడటం లేదు.
Read Also: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురి హత్య జరిగింది. నలుగురు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు చనిపోగా.. కూచ్ బెహార్ లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ని కాల్చి చంపారు. మరో సంఘటనలో సీపీఎం కార్యకర్త కోల్కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మల్దా జిల్లాలో ఒక టీఎంసీ కార్యకర్త బాంబు దాడిలో మరణించాడు. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, 24 పరగణ జిల్లాల్లో కూడా హింస చెలరేగింది. రిజినగర్, తుఫాన్ గంజ్, కాగ్రమ్ ప్రాంతాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కాల్చి చంపబడ్డారు. 24 పరగణ జిల్లాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బూల్ ఏజెంట్ చంపబడ్డాడు. ఈ హత్య వెనక టీఎంసీ అభ్యర్థి మున్నా బిబి ఉన్నట్లు ప్రజలు ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీజేపీతో పాటు సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీల మధ్య తీవ్ర హింస చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ రోజు మరణాలకు ముందు 12 పైగా మంది కార్యకర్తలు పలు జిల్లాల్లో జరిగిన దాడుల్లో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 20కి పైగా చేరాయి. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివీ ఆనంద్ బోస్ పంచాయతీ ఎన్నికలను పరిశీలించేందుకు 24 పరగణ జిల్లాకు వెళ్లారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!