West Bengal: బెంగాల్ల్లో హత్యారాజకీయం.. పంచాయతీ పోలింగ్ రోజే ఏడుగురి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బెంగాల్ లోని మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతున్నా.. హింసకు అడ్డుకట్టపడటం లేదు.
Read Also: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురి హత్య జరిగింది. నలుగురు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు చనిపోగా.. కూచ్ బెహార్ లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ని కాల్చి చంపారు. మరో సంఘటనలో సీపీఎం కార్యకర్త కోల్కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మల్దా జిల్లాలో ఒక టీఎంసీ కార్యకర్త బాంబు దాడిలో మరణించాడు. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, 24 పరగణ జిల్లాల్లో కూడా హింస చెలరేగింది. రిజినగర్, తుఫాన్ గంజ్, కాగ్రమ్ ప్రాంతాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కాల్చి చంపబడ్డారు. 24 పరగణ జిల్లాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బూల్ ఏజెంట్ చంపబడ్డాడు. ఈ హత్య వెనక టీఎంసీ అభ్యర్థి మున్నా బిబి ఉన్నట్లు ప్రజలు ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీజేపీతో పాటు సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీల మధ్య తీవ్ర హింస చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ రోజు మరణాలకు ముందు 12 పైగా మంది కార్యకర్తలు పలు జిల్లాల్లో జరిగిన దాడుల్లో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 20కి పైగా చేరాయి. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివీ ఆనంద్ బోస్ పంచాయతీ ఎన్నికలను పరిశీలించేందుకు 24 పరగణ జిల్లాకు వెళ్లారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!