Amit Shah: కాశ్మీర్లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పీఓకే మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పీఓకే భారత్లో అంతర్భాగమని, దానిని మేం తీసుకుంటామని అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా ఉండే జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం ఇప్పుడు ఆజాదీ నినాదాలు, నిరసనలు ప్రతిధ్వనిస్తోందని పశ్చిమ బెంగాల్ సేరంపూర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి షా అన్నారు. ఇప్పుడు పీఓకేలో ప్రజలు రాళ్లు రువ్వతున్నారని చెప్పారు.
Read Also: AP Elections 2024: ఫైనల్లీ ఏపీ పోలింగ్ శాతం చెప్పేశారు.. 2019 కంటే ఎంత పెరిగిందంటే?
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
ఇటీవల పీఓకేపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మణిశంకర్ అయ్యర్ వంటి కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నందును పీఓకేని తీసుకోవద్దని చెప్పారు. అయితే, నేను పీఓకే భారత్లో భాగమే అని చెబుతున్నాను, దానిని భారత్ తిరిగి తీసుకుంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవినీతి నాయకులు ఉన్న ఇండియా కూటమికి, నిజాయితీ కలిగిన నరేంద్రమోడీకి మధ్య జరుగుతున్నాయని, ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న ఒక్క పైసా ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అన్నారు.
చొరబాటుదారులు కావాలా..? లేక శరణార్ధులకు సీఏఏ కావాలా అనే దాన్ని బెంగాల్ నిర్ణయించుకోవాలని అన్నారు. జీహాద్కి ఓటేయాలా..? లేక వికాస్కి ఓటేయాలా..? అనే విషయాన్ని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏని వ్యతిరేకించి తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలని, చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టిందని అమిత్ షా నిందించారు.
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!