Vinesh Phogat: వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు.. మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య
- వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు
- మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అనర్హతకు గురైనప్పుడు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు కారణంగా వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది. దీంతో ఆమెను ఓదార్చడానికి ప్రధాని మోడీ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. అయితే తాను మాట్లాడటానికి నిరాకరించినట్లు వినేష్ తెలిపారు. తనకు నేరుగా మోడీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. అక్కడ ఉన్న భారత అధికారులు తన దగ్గరకు వచ్చి మోడీ మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. అందుకు సిద్ధంగానే ఉన్నానని.. కానీ అధికారులు మాత్రం షరతులు పెట్టారని చెప్పారు. తన బృందం నుంచి ఎవరూ మాట్లాడకూడదని.. ప్రధాని మోడీ నుంచి మాత్రం ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారు. ఈ పరిణామం తనకు రుచించలేదన్నారు. అసలే నిష్క్రమణకు గురైన బాధతో ఉంటే.. తన భావోద్వేగాలను, కృషిని సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవడానికి ఇష్టపడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ.. లెబనాన్లో 8 మంది సైనికుల మృతి
ఎలాంటి షరతులు లేకుండా ప్రధాని మోడీ నేరుగా ఫోన్ చేసి ఉంటే మాట్లాడేదాన్ని అని వివరించారు. అంతేకాకుండా తప్పకుండా అభినందించేదానిని అని పేర్కొన్నారు. నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే రికార్డు చేయకుండా కాల్ చేసే ఉండేవారన్నారు. అప్పుడు తాను కృతజ్ఞత కలిగి ఉండేదాన్ని అని వివరించారు. ‘‘నాతో మాట్లాడితే గత రెండేళ్ళ గురించి అడుగుతానని పీఎం మోడీకి తెలిసి ఉండవచ్చు. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులు సూచించారు. ఇలా అయితే.. వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. మాములుగా మాట్లాడితే.. నేను ఒరిజినల్ కాల్ను బయటపెడతానని వారికి తెలుసు’’ అని వినేష్ ఫోగట్ అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి చేరుకున్నాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!