Vinesh Phogat: వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు.. మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య
- వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు
- మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అనర్హతకు గురైనప్పుడు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు కారణంగా వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది. దీంతో ఆమెను ఓదార్చడానికి ప్రధాని మోడీ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. అయితే తాను మాట్లాడటానికి నిరాకరించినట్లు వినేష్ తెలిపారు. తనకు నేరుగా మోడీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. అక్కడ ఉన్న భారత అధికారులు తన దగ్గరకు వచ్చి మోడీ మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. అందుకు సిద్ధంగానే ఉన్నానని.. కానీ అధికారులు మాత్రం షరతులు పెట్టారని చెప్పారు. తన బృందం నుంచి ఎవరూ మాట్లాడకూడదని.. ప్రధాని మోడీ నుంచి మాత్రం ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారు. ఈ పరిణామం తనకు రుచించలేదన్నారు. అసలే నిష్క్రమణకు గురైన బాధతో ఉంటే.. తన భావోద్వేగాలను, కృషిని సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవడానికి ఇష్టపడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ.. లెబనాన్లో 8 మంది సైనికుల మృతి
ఎలాంటి షరతులు లేకుండా ప్రధాని మోడీ నేరుగా ఫోన్ చేసి ఉంటే మాట్లాడేదాన్ని అని వివరించారు. అంతేకాకుండా తప్పకుండా అభినందించేదానిని అని పేర్కొన్నారు. నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే రికార్డు చేయకుండా కాల్ చేసే ఉండేవారన్నారు. అప్పుడు తాను కృతజ్ఞత కలిగి ఉండేదాన్ని అని వివరించారు. ‘‘నాతో మాట్లాడితే గత రెండేళ్ళ గురించి అడుగుతానని పీఎం మోడీకి తెలిసి ఉండవచ్చు. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులు సూచించారు. ఇలా అయితే.. వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. మాములుగా మాట్లాడితే.. నేను ఒరిజినల్ కాల్ను బయటపెడతానని వారికి తెలుసు’’ అని వినేష్ ఫోగట్ అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి చేరుకున్నాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
తాజావార్తలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?