Gyanvapi case: “శివలింగం” పూజా హక్కులపై ఈ రోజు వారణాసి కోర్టు తీర్పు..
Varanasi court to deliver its verdict on plea seeking worship rights of ‘Shivling’ on Gyanvapi premises: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. హిందూ పక్షం మసీదులోని కొలనులో లభించిన ‘ శివలింగం ’ ఆకారాన్ని పూజించేందుకు అనుమతించాలని కోర్టును కోరింది. దీనిపై నేడు తీర్పును వెల్లడించనుంది. నవంబర్ 8న ఈ కేసు తీర్పును నవంబర్ 14కు వాయిదా వేసింది. హిందూ పక్షం శివలింగానికి పూజలతో పాటు, ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మాత్రం శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించడంతో పాటు ముస్లింలు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని నవంబర్ 11న తీర్పు చెప్పింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Uttar Pradesh: ఎనర్జీ పిల్ వేసుకుని అఘాయిత్యం… ఆ తర్వాత ఏమైంది?
అంతకుముందు ఈ విషయంలో శివలింగం వయసు తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసికోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు గతంలో జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేశారు. దీంట్లో వాజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకారం లభించింది. ఇది కాశీ విశ్వనాథుడి శివలింగమే అని హిందూ పక్షం చెబుతోంది. ఇదిలా ఉంటే ఇది కొలనులోని ఫౌంటేన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. అయితే ఈ రోజు వారణాసి కోర్టు ఏం తీర్పు చెబుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ముస్లింపక్షం గతంలో ఈ మసీదుకు ప్రార్థనా స్థలాల చట్టం-1991ని అమలు చేయాలని కోరింది. స్వాతంత్య్రం అనంతర ప్రార్థనా స్థలాల స్థితిని మార్చవద్దని ఈ చట్టం చెబుతుంది. అయితే జ్ఞానవాపి మసీదు కేసులో ఇది వర్తించదని వారణాసి కోర్టు స్పష్టం చేసింది. కాగా.. ముస్లిం తరుపు న్యాయవాది తౌహిద్ ఖాన్ మాట్లాడుతూ.. కోర్టు ఈ కేసును కొట్టి వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను రోజూ పూజించడానికి అనుమతికి సంబంధించి జిల్లా కోర్టులో ఉందని.. అయితే కొనసాగుతున్న కేసు మసీదుకు సంబంధించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!