Gyanvapi case: “శివలింగం” పూజా హక్కులపై ఈ రోజు వారణాసి కోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi court to deliver its verdict on plea seeking worship rights of ‘Shivling’ on Gyanvapi premises: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. హిందూ పక్షం మసీదులోని కొలనులో లభించిన ‘ శివలింగం ’ ఆకారాన్ని పూజించేందుకు అనుమతించాలని కోర్టును కోరింది. దీనిపై నేడు తీర్పును వెల్లడించనుంది. నవంబర్ 8న ఈ కేసు తీర్పును నవంబర్ 14కు వాయిదా వేసింది. హిందూ పక్షం శివలింగానికి పూజలతో పాటు, ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మాత్రం శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించడంతో పాటు ముస్లింలు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని నవంబర్ 11న తీర్పు చెప్పింది.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Read Also: Uttar Pradesh: ఎనర్జీ పిల్ వేసుకుని అఘాయిత్యం… ఆ తర్వాత ఏమైంది?
అంతకుముందు ఈ విషయంలో శివలింగం వయసు తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసికోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు గతంలో జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేశారు. దీంట్లో వాజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకారం లభించింది. ఇది కాశీ విశ్వనాథుడి శివలింగమే అని హిందూ పక్షం చెబుతోంది. ఇదిలా ఉంటే ఇది కొలనులోని ఫౌంటేన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. అయితే ఈ రోజు వారణాసి కోర్టు ఏం తీర్పు చెబుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ముస్లింపక్షం గతంలో ఈ మసీదుకు ప్రార్థనా స్థలాల చట్టం-1991ని అమలు చేయాలని కోరింది. స్వాతంత్య్రం అనంతర ప్రార్థనా స్థలాల స్థితిని మార్చవద్దని ఈ చట్టం చెబుతుంది. అయితే జ్ఞానవాపి మసీదు కేసులో ఇది వర్తించదని వారణాసి కోర్టు స్పష్టం చేసింది. కాగా.. ముస్లిం తరుపు న్యాయవాది తౌహిద్ ఖాన్ మాట్లాడుతూ.. కోర్టు ఈ కేసును కొట్టి వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను రోజూ పూజించడానికి అనుమతికి సంబంధించి జిల్లా కోర్టులో ఉందని.. అయితే కొనసాగుతున్న కేసు మసీదుకు సంబంధించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?