Powermen vs policemen: పోలీసులకు తమ “పవర్” చూపించిన విద్యుత్ అధికారులు…
- ఉత్తర్ ప్రదేశ్లో పోలీసులు వర్సెస్ విద్యుత్ అధికారులు..
- పోలీసులకు తమ పవర్ చూపించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Powermen vs policemen: ఉత్తర్ ప్రదేశ్లో రెండు ప్రభుత్వ విభాగాల మధ్య ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. హాపూర్లో విద్యుత్ అధికారులు, పోలీసుల మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. భద్స్యానా గ్రామంలో విద్యుత్ కాంట్రాక్టర్ ప్రదీప్ కుమార్, కరెంట్ వినియోగదారుడు అమర్పాల్కు మధ్య జరిగిన ఘర్షణ పూర్తిస్థాయిలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య వివాదంగా మారింది. ఈ ఘర్షణ తర్వాత ప్రదీప్ కుమార్, అమర్పాల్ను పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది.
Read Also: Amit Shah: కాంగ్రెస్ హయాంలో 3 సార్లు “ఓట్ చోరీ”.. నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీల ఉదాహరణలు..
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
గంటల వ్యవధిలోనే విద్యుత్ శాఖలో ఈ పరిణామం ఆగ్రహానికి కారణమైంది. పోలీసులు అమర్పాల్ను రక్షిస్తున్నారని, తమ సహోద్యోగిని తప్పుడు ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అనేక మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది. బహదూర్గఢ్ పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారు. పోలీస్ స్టేషన్ రూ. 3,43,974 బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ స్టేషన్కు నోటీసులు అంటించారు. పోలీస్ స్టేషన్కు విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పోలీస్ స్టేషన్ సమీపంలోని నివాస కాలనీ నుంచి అక్రమంగా విద్యుత్ను తీసుకుంటోందని, రూ. 3.5 లక్షల బకాయీ పెండింగ్లో ఉందని, కనెక్షన్ కట్ చేయడాన్ని సమర్థిస్తూ ఏఈ సూర్య ఉదయ్ కుమార్ చెప్పారు. మరోవైపు ప్రజల ఆందోళలు తీవ్రం కావడంతో సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఫిర్యాదు చేసిన తర్వాత ఇరు వర్గాల మధ్య తీవ్ర అపార్థాలు జరిగాయని అదనపు ఎస్పీ వినీత్ భట్నాగర్ చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఇప్పుడు సమస్య పరిష్కరించబడిందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!