Amit Shah: కాంగ్రెస్ హయాంలో 3 సార్లు “ఓట్ చోరీ”.. నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీల ఉదాహరణలు..
- ఓట్ చోరీపై పార్లమెంట్లో అమిత్ సా వర్సెస్ రాహుల్ గాంధీ..
- కాంగ్రెస్ హయాంలోనే 3 సార్లు ఓట్ చోరి..
- నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీల ఉదాహరణలు..
- పార్లమెంట్లో నిప్పులు చెరిగిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పార్లమెంట్ ‘‘ఓట్ చోరీ’’ అంశంపై దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఓట్ చోరీపై తనతో సభలో చర్చకు సిద్ధమా అంటూ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై చర్చించేందు అమిత్ షా భయపడుతున్నారని అన్నారు. హర్యానాలో 19 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే, దీనికి ప్రతిగా నా ప్రసంగంలో నేను ఎప్పుడు ఏది మాట్లాడాలో మీరు నిర్ణయించలేరని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ సహనంతో ఉండాలని షా హితవు పలికారు. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను మన్మోహన్ సింగ్ హయాంతో కూడా చేసిందని అమిత్ షా గుర్తు చేశారు.
Read Also: New Kia Seltos: కొత్త అవతార్లో “కియా సెల్టోస్”, సియెర్రాకు టఫ్ కాంపిటీషన్ గ్యారెంటీ..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేయలేదని షా అన్నారు. తమ హయాంలో విపక్షాలు అన్ని చోట్ల గెలిచాయని చెప్పారు. నిజానికి ఓట్ చోరీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని షా ఆరోపించారు. స్వాతంత్ర్యానికి ముందు సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికీ, నెహ్రూ ప్రధాని అయ్యారని చెప్పారు. ఇందిరా గాంధీ రాయ్బరేలీలో గెలిచినప్పుడు రెండోసారి ఓట్ చోరీ జరిగిందని, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. సోనియాగాంధీ భారతదేశ పౌరురాలు కాకముందే ఓటర్ అయ్యారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!