Uddhav Thackeray: బీజేపీ ‘పవర్ జిహాద్’’ చేస్తుంది.. ‘‘సౌగత్ ఏ మోడీ’’ స్కీమ్పై విమర్శలు..
- బీజేపీ ‘పవర్ జిహాద్’ చేస్తోంది..
- సౌగత్-ఏ-మోడీ పథకంపై ఠాక్రే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని విమర్శించారు. బీజేపీ కొత్తగా ప్రారంభించిన ‘‘సౌగత్-ఏ-మోడీ’’ పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టి సత్తా జిహాద్(పవర్ జిహాద్)ని ఆశ్రయించిందని ఆరోపించారు. బీజేపీ పథకాన్ని ఠాక్రే ‘‘’సౌగత్-ఎ-సత్తా (అధికార బహుమతి)’’గా అభివర్ణించారు. బీహార్లో ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టినట్లు ప్రకటించాలని, బుల్డోజర్ల ద్వారా ఇళ్లు కూల్చేసేసిన వారికి, మత అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన చాలా మందికి వారు అధికారం కోసం బహుమతులు పంచుతున్నారని, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే అని, బీజేపీ సత్తా జిహాద్ని ఆశ్రయించిందని ఠాక్రే విమర్శించారు.
Also Read
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
రంజాన్కి ముందు ఆర్థికంగా వెనకబడిన ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ మంగళవారం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ముస్లింలకు ప్రత్యేక పండగ కిట్లను పంపిణీ చేస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఈ పథకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 32 లక్షల మందికి దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈద్ కిట్లలో డ్రైఫ్రూట్స్, శనిగపిండి, రవ్వ, వెర్మిసెల్లి, చక్కెర వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. పురుషుల కోసం కుర్తా పైజామా, మహిళల డ్రెస్ కోసం మెటీరియల్ అందిస్తున్నారు. ప్రతీ కిట్ కూడా రూ. 500-రూ.600 వరకు ఉంటుంది.
అయితే, ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షామా మహ్మద్ ఈ కార్యక్రమాన్ని ‘‘కపట నాటకం’’గా అభివర్ణించారు. ముస్లిం సమాజాన్ని రాక్షసంగా చిత్రీకరించి , ఇళ్లు నేలమట్టం చేసి ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తోందని విమర్శించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బీజేపీ చర్యని రాజకీయ చర్యగా పిలిచారు. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ దీనిని ‘‘జోక్ ఆఫ్ ది డే’’గా అన్నారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!