Shiv Sena: ఇప్పుడు ఎన్నికలు జరిగినా శివసేకు 100 సీట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగితే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 సీట్లకు పైగా గెలుస్తుందని పేర్కొన్నారు. శివసేన తరపున 100 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని… మధ్యంతర ఎన్నికల్లో చూసుకుందామని ఉద్ధవ్ థాక్రే చెప్పారని, అప్పుడే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తేలుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
బాలా సాహెబ్ థాకరే పార్టీ కాబట్టి శివసేనను ఎవరూ హైజాక్ చేయలేరని అన్నారు సంజయ్ రౌత్.. శివసేన బాబా థాకరేది.. అది మరెవరికీ కాదు.. మీరు డబ్బు ద్వారా దానిని హైజాక్ చేయలేరు అన్నారు. ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం డబ్బు మాత్రమే కాకుండా మరేదైనా ఇచ్చారని వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఆయన.. అది ఏదో రివీల్ అయినప్పుడు ఇది పెద్ద ఎక్స్పోజ్ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని మేం ఇప్పటికీ ఆశిస్తున్నాము… మేము ఎల్లప్పుడూ తిరుగుబాటుదారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని.. వారు మా ప్రజలు, తిరిగి వస్తారు.. ‘శుభ కా భూలా అగర్ షామ్ కో ఘర్ ఆ జాయే తో ఉస్సే భూలా నహీ కెహతే,’ అని పేర్కొన్నారు సంజయ్ రౌత్.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!