Shiv Sena: ఇప్పుడు ఎన్నికలు జరిగినా శివసేకు 100 సీట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగితే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 సీట్లకు పైగా గెలుస్తుందని పేర్కొన్నారు. శివసేన తరపున 100 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని… మధ్యంతర ఎన్నికల్లో చూసుకుందామని ఉద్ధవ్ థాక్రే చెప్పారని, అప్పుడే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తేలుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
Also Read
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
బాలా సాహెబ్ థాకరే పార్టీ కాబట్టి శివసేనను ఎవరూ హైజాక్ చేయలేరని అన్నారు సంజయ్ రౌత్.. శివసేన బాబా థాకరేది.. అది మరెవరికీ కాదు.. మీరు డబ్బు ద్వారా దానిని హైజాక్ చేయలేరు అన్నారు. ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం డబ్బు మాత్రమే కాకుండా మరేదైనా ఇచ్చారని వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఆయన.. అది ఏదో రివీల్ అయినప్పుడు ఇది పెద్ద ఎక్స్పోజ్ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని మేం ఇప్పటికీ ఆశిస్తున్నాము… మేము ఎల్లప్పుడూ తిరుగుబాటుదారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని.. వారు మా ప్రజలు, తిరిగి వస్తారు.. ‘శుభ కా భూలా అగర్ షామ్ కో ఘర్ ఆ జాయే తో ఉస్సే భూలా నహీ కెహతే,’ అని పేర్కొన్నారు సంజయ్ రౌత్.
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!