Shiv Sena: ఇప్పుడు ఎన్నికలు జరిగినా శివసేకు 100 సీట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగితే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 సీట్లకు పైగా గెలుస్తుందని పేర్కొన్నారు. శివసేన తరపున 100 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని… మధ్యంతర ఎన్నికల్లో చూసుకుందామని ఉద్ధవ్ థాక్రే చెప్పారని, అప్పుడే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తేలుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
బాలా సాహెబ్ థాకరే పార్టీ కాబట్టి శివసేనను ఎవరూ హైజాక్ చేయలేరని అన్నారు సంజయ్ రౌత్.. శివసేన బాబా థాకరేది.. అది మరెవరికీ కాదు.. మీరు డబ్బు ద్వారా దానిని హైజాక్ చేయలేరు అన్నారు. ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం డబ్బు మాత్రమే కాకుండా మరేదైనా ఇచ్చారని వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఆయన.. అది ఏదో రివీల్ అయినప్పుడు ఇది పెద్ద ఎక్స్పోజ్ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని మేం ఇప్పటికీ ఆశిస్తున్నాము… మేము ఎల్లప్పుడూ తిరుగుబాటుదారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని.. వారు మా ప్రజలు, తిరిగి వస్తారు.. ‘శుభ కా భూలా అగర్ షామ్ కో ఘర్ ఆ జాయే తో ఉస్సే భూలా నహీ కెహతే,’ అని పేర్కొన్నారు సంజయ్ రౌత్.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?