Anurag Thakur: “తుక్డే-తుక్డే గ్యాంగ్ మైండ్సెట్”.. రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ గెలుపును ఉద్దేశిస్తూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణ భారత దేశంలో గెలవదని డీఎంకే పార్టీ ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంట్లో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ వసుధైవ కుటుంబం(ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సందేశాన్ని ప్రపంచానికి ఇస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ నిందిస్తున్నాయని ఆయన అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోవడంతో ఈవీఎంలను నిందిస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Also Read
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
Read Also: Gaumutra remark: “గోమూత్ర రాష్ట్రాలు”.. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన డీఎంకే ఎంపీ..
భారతదేశ ఐక్యతను దెబ్బతీసేందుక పక్కా ప్రణాళితో కూడిన కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అమేథిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటి నుంచి ఇది ప్రారంభమైందని, రాహుల్ గాంధీ వయనాడ్లో చేసిన ప్రకటన ఉత్తర భారతీయులను కించపరిచేలా ఉందని అన్నారు. రాహుల్ గాంధీ మాటలు శత్రుత్వాన్ని, దేశాన్ని విభజించే పనిని సూచిస్తున్నాయని అన్నారు. వారు అర్థరాత్రి తుక్డే-తుక్డే గ్యాంగ్ వైపు నిలబడ్డారని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. మేము ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతించమని స్పష్టం చేశారు. తుక్డే-తుక్డే ఆలోచనలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
‘‘రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నా ప్రశ్న ఏమిటంటే, దేశాన్ని విభజించే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తోంది? మీరు కొన్నిసార్లు కులతత్వాన్ని మరియు కొన్నిసార్లు ప్రాంతీయతను వ్యాప్తి చేస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రజలపై పదే పదే ఎందుకు దాడులు చేస్తున్నారు? మీ మిత్ర పక్షాలు ఉత్తర భారతీయులపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటాయి, మీరు మౌనంగా ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు మౌనంగా ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తోంది?’’ అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు చేసిన వ్యాఖ్యలు ముందస్తుగా సిద్ధం చేసినవే అని.. కాంగ్రెస్ సభ్యులు వెనక ఉండీ దాని మిత్ర పక్షాలతో ఇలా వ్యవహరిస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!