Gaumutra remark: “గోమూత్ర రాష్ట్రాలు”.. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన డీఎంకే ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaumutra remark: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన ‘గోమూత్ర రాష్ట్రాలు’ అనే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ‘‘బీజేపీ హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో, అంటే మేము వీటిని గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని వాటిలోనే గెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తునే ఉన్నాం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఆ వ్యాఖ్యలు అనుకోకుండా చేశానని, విచారం వ్యక్తం చేస్తు్న్నానని, క్షమాపణలు చెప్పారు. ‘‘నేను నిన్న అనుకోకుండా చేసిన ప్రకటన. ఇది సభ్యులు మరియు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే, నేను దానిని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. పదాలను తొలగించమని నేను అభ్యర్థిస్తున్నాను. దానికి నేను చింతిస్తున్నాను’’ అంటూ సెంథిల్ కుమార్ అన్నారు.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: BJP MPs Resign: బీజేపీ సీఎంలపై ఉత్కంఠ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10 ఎంపీల రాజీనామా..
సెంథిల్ కుమార్ వ్యాఖ్యల్ని పలువురు హిందీ రాష్ట్రాల ఎంపీలు తప్పుపట్టారు. సెంథిల్ కుమార్ ప్రసంగంపై విమర్శలు వెల్లువెత్తడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ఆయన చేసిన వ్యాక్యల్ని బహిష్కరించారు. ఆదివారం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఫలితాల తర్వాత ఎంపీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. వరదల్లో చెన్నై మునిగిన విధంగానే డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, వారి అహంకారమే పతనానికి దారి తీస్తుందని అన్నారు. పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని, నిన్నమొన్నటి వరకు కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయాన్ని డీఎంకే మరిచిపోయిందని అన్నారు. కొన్ని నెలల క్రితం డీఎంకే మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!