Tripura: బీజేపీని సవాల్ చేసిన త్రిపా మోథా.. ఆ ఒక్కటి తప్పా అన్నింటికి సిద్ధమన్న కాషాయపార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura Election Results: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే త్రిపులో బీజేపీ భారీ విజయం సాధించింది. కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చిన బీజేపీ వరసగా రెండో సారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ రోజు వెల్లడించిన అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ స్థానాలు సాధించింది. త్రిపులో మొత్తం 60 స్థానాలు ఉంటే ఇప్పటికే బీజేపీ 34 చోట్ల విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 26 చోట్ల విజయం సాధించగా.. మరో 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సారి త్రిపురలో బీజేపీని సవాల్ చేస్తూ నిలబడింది ‘‘త్రిపా మోథా’’. మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్ బిక్రమ్ వర్మ నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ బీజేపీని నిలువరించింది. త్రిపురలో ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ త్రిపా మోథా పార్టీ ఏర్పడింది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: BJP: జాతీయ పార్టీల నిధుల్లో సగానికి పైగా బీజేపీకే.. వెల్లడించిన ఎన్నికల సంఘం..
ప్రస్తుత ఎన్నికల్లో త్రిపామోథా 13 స్థానాల్లో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ పార్టీతో కలిసి మొత్తం 60 స్థానాలకు గానూ 44 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం త్రిపా మోథా కారణంగా సీట్లు పడిపోయాయి. కేవలం 33-34 సీట్లకు మాత్రమే బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ కూటమితో సంబంధం లేకుండా 36 సీట్లను గెలుచుకుంటే ఈసారి ఏకంగా 11 స్థానాలను కోల్పోయింది.
2021 త్రిపుర ఆదివాసీ ప్రాంతాల స్వయం ప్రతిపత్తి మండలి ఎన్నికల్లో త్రిపామోథా 30కి గానూ 18 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ చీఫ్ ప్రద్యోత్ ప్రత్యేక రాష్ట్రం తిప్రల్యాండ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిపామోథా, బీజేపీకి సపోర్ట్ ఇస్తే ఒక్క ప్రత్యేక రాష్ట్రం మినహా అన్ని డిమాండ్లను నెరవేరస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ అధికార ప్రతినిధి సుబ్రతా చక్రవర్తి ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!