BJP: జాతీయ పార్టీల నిధుల్లో సగానికి పైగా బీజేపీకే.. వెల్లడించిన ఎన్నికల సంఘం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.
Read Also: Allu Arjun: పుష్ప 2 ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్, దేశముదురు రీరిలీజ్… అన్నీ ఒకటే రోజు
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
నాలుగు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, త్రుణమూల్ కాంగ్రెస్ తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతం (రూ. 1811.94 కోట్లు)ను ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2021-22లో బీజేపీ మొత్తం ఆదాయం రూ. 1917.12 కోట్లుగా ప్రకటించింది. అయితే ఇది మొత్తం ఆదాయంలో 44.57 శాతం( రూ. 854.46 కోట్లు)ను మాత్రమే ఖర్చు చేసింది. త్రుణమూల్ కాంగ్రెస్ మొత్తం ఆదాయంలో రూ. 545.745 కోట్లు కాగా.. ఆ పార్టీ రూ. 268.337 కోట్లు ఖర్చు చేసింది. త్రుణమూల్ కాంగ్రెస్ మొత్తం ఖర్చు ఈ ఏడాదిలో 49.17 శాతంగా ఉంది. కాంగ్రెస్ మొత్తం ఆదాయం రూ. 541.245 కోట్లు కాగా.. పార్టీ తన ఆదాయంలో 73.98 శాతం రూ. 400.414 కోట్లు ఖర్చు చేసింది.
2019-20లో విక్రయించిన పోల్ బాండ్లలో బీజేపీకి 76 శాతం వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 9 శాతం మాత్రమే వచ్చాయి. మొత్తం 8 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ). నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) పార్టీలు దేశం నలుమూలల నుంచి సేకరించిన ఫండ్స్ ద్వారా రూ. 3289.34 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. బీజేపీ అన్ని జాతీయ పార్టీతో పోలిస్తే 2021-22లో రూ. 1917.12 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం 8 జాతీయ పార్టీల ఆదాయంలో 58.28 శాతం. త్రుణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!