Manipur: మణిపూర్లో దుండగుల దాడిలో ముగ్గురు మృతి… కొనసాగుతున్న హింస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ హింసను ఆపలేకపోతున్నారు. ఆదివారం అర్థరాత్రి మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఖొయిజుమన్తాబి అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై దుండగులు దాడి చేశారు. దుండగుల దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు మరణించారు. మే 3న ప్రారంభమైన హింస ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మణిపూర్లో శాంతియుత వాతావరణం కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 4 రోజులపాటు అక్కడే ఉండి పలువురితో సమావేశాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సైతం సమావేశాలను నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. ఇప్పటికీ మణిపూర్లో రావణకాష్టంలాగా హింస జరుగుతూనే ఉంది.
Read also: Payal Rajput: ఆ హీరోతో ఒక్కసారైనా ఆ పని చెయ్యాలి?
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
ఆదివారం అర్ధరాత్రి ఖొయిజుమన్తాబి సమీపంలోని కొండలపై నుంచి వచ్చిన దుండగులు దాడి చేశారని.. ఈ దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు (Village volunteers) మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారని, ఆ సమయంలో కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం మూసివేసిన 2వ నంబర్ జాతీయ రహదారిని కుకీ తెగలు తిరిగి తెరిచాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కంగ్పోక్పీ జిల్లాలోని జాతీయ రహదారి దిగ్భంధాన్ని విరమించుకున్నట్లు కూకీ తెగలకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (UPF), కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (KNO) వెల్లడించాయి. మణిపూర్లో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇంఫాల్ నుంచి దిమాపూర్ వరకు ఎన్హెచ్-2, ఇంఫాల్ నుంచి జిరిబామ్ వరకు ఎన్హెచ్ 37 ఉన్నాయి. రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు హైవేలను కుకీ తెగ నిరసనకారులు మూసివేశారు. మణిపూర్లో జరుగుతున్న హింసపై త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై పార్లమెంటులో లేవనెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..