Rahul Gandhi : “ఆపరేషన్ సిందూర్”పై రాహుల్ గాంధీ స్పందన ఇదే..
- ఆపరేషన్ సిందూర్పై స్పందించిన రాహుల్ గాంధీ..
- భారత సైన్యానికి పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడి..
Rahul Gandhi: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో విరుచుకుపడ్డాయి. పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సులోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో భారత్ విరుచుకుపడింది. మొత్తం 09 స్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారుగా 80-100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థల కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లని పూర్తిగా నేలమట్టం చేశారు.
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్పై కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. భారత సాయుధ దళాల ప్రతీకార దాడులకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సైన్యం తీసుకున్న చర్యల్ని ఆయన ప్రశంసించారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలకు చాలా ప్రేమతో శుభాకాంక్షలు చెబుతున్నారనని అన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Operation Sindoor: యుద్ధానికి కారణమైన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?
రేపు కేంద్రం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరవుతుందని రాహుల్ గాంధీ ధ్రువీకరించారు. పాకిస్తాన్, పీఓకే నుంచి ఉత్పన్నమయ్యే అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. “జాతీయ ఐక్యత మరియు సంఘీభావం ప్రస్తుత అవసరం మరియు భారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. గతంలో మన నాయకులు ఈ మార్గాన్ని చూపించారు . జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది” అని ఆపరేషన్ సిందూర్ హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేశారు.
బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ అంతటా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
#WATCH | #OperationSindoor | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We got a call today, we have been invited to the all-party meeting tomorrow." pic.twitter.com/a0WfFSqFeq
— ANI (@ANI) May 7, 2025
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!