UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Tractor Accident: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కాల్వలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తాజ్పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో బుధవారం నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. గురువారం మరో ఐదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులుండటం మరో విషాదం.
Read Also: Gandeevadhari Arjuna Twitter Review: ‘గాండీవధారి అర్జున’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలో ట్రాక్టర్-ట్రాలీ కాలువలో పడి నలుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది మరణించారు. ట్రాలీలో దాదాపు 50 మంది భక్తులను రాండువల్ గ్రామానికి ఒక మతపరమైన కార్యక్రమం కోసం తీసుకువెళుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకి తెలిపారు. మృతుల్లో సులోచన (58), మంగ్లేష్ (50), అదితి(5), అర్జున్ (12)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. నది యొక్క బలమైన ప్రవాహానికి అనేక మృతదేహాలు కొట్టుకుపోయాయి. సంఘటనా స్థలాన్ని సహరాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్, ఎస్పీ డాక్టర్ విపిన్ తడా సందర్శించారు. ఎస్పీ తడ గ్రామస్తులను ఆ మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్ ఎస్పీ మాటలను బేఖాతరు చేశారన్నారు. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి బుల్డోజర్ను స్థలానికి పిలిపించినట్లు SP తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితుల మరణాలపై సంతాపం వ్యక్తం చేశారు, బాధితుల కుటుంబాలకు తక్షణమే రూ. 4 లక్షలు మంజూరు చేయాలని సహరాన్పూర్ పరిపాలన అధికారులను ఆదేశించినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- Tags
- 9 People
- Canal
- died
- Tractor Accident
- UP
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?