UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Tractor Accident: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కాల్వలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తాజ్పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో బుధవారం నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. గురువారం మరో ఐదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులుండటం మరో విషాదం.
Read Also: Gandeevadhari Arjuna Twitter Review: ‘గాండీవధారి అర్జున’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలో ట్రాక్టర్-ట్రాలీ కాలువలో పడి నలుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది మరణించారు. ట్రాలీలో దాదాపు 50 మంది భక్తులను రాండువల్ గ్రామానికి ఒక మతపరమైన కార్యక్రమం కోసం తీసుకువెళుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకి తెలిపారు. మృతుల్లో సులోచన (58), మంగ్లేష్ (50), అదితి(5), అర్జున్ (12)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. నది యొక్క బలమైన ప్రవాహానికి అనేక మృతదేహాలు కొట్టుకుపోయాయి. సంఘటనా స్థలాన్ని సహరాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్, ఎస్పీ డాక్టర్ విపిన్ తడా సందర్శించారు. ఎస్పీ తడ గ్రామస్తులను ఆ మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్ ఎస్పీ మాటలను బేఖాతరు చేశారన్నారు. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి బుల్డోజర్ను స్థలానికి పిలిపించినట్లు SP తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితుల మరణాలపై సంతాపం వ్యక్తం చేశారు, బాధితుల కుటుంబాలకు తక్షణమే రూ. 4 లక్షలు మంజూరు చేయాలని సహరాన్పూర్ పరిపాలన అధికారులను ఆదేశించినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- Tags
- 9 People
- Canal
- died
- Tractor Accident
- UP
తాజావార్తలు
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!