UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Tractor Accident: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కాల్వలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తాజ్పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో బుధవారం నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. గురువారం మరో ఐదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులుండటం మరో విషాదం.
Read Also: Gandeevadhari Arjuna Twitter Review: ‘గాండీవధారి అర్జున’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలో ట్రాక్టర్-ట్రాలీ కాలువలో పడి నలుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది మరణించారు. ట్రాలీలో దాదాపు 50 మంది భక్తులను రాండువల్ గ్రామానికి ఒక మతపరమైన కార్యక్రమం కోసం తీసుకువెళుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకి తెలిపారు. మృతుల్లో సులోచన (58), మంగ్లేష్ (50), అదితి(5), అర్జున్ (12)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. నది యొక్క బలమైన ప్రవాహానికి అనేక మృతదేహాలు కొట్టుకుపోయాయి. సంఘటనా స్థలాన్ని సహరాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్, ఎస్పీ డాక్టర్ విపిన్ తడా సందర్శించారు. ఎస్పీ తడ గ్రామస్తులను ఆ మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్ ఎస్పీ మాటలను బేఖాతరు చేశారన్నారు. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి బుల్డోజర్ను స్థలానికి పిలిపించినట్లు SP తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితుల మరణాలపై సంతాపం వ్యక్తం చేశారు, బాధితుల కుటుంబాలకు తక్షణమే రూ. 4 లక్షలు మంజూరు చేయాలని సహరాన్పూర్ పరిపాలన అధికారులను ఆదేశించినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- Tags
- 9 People
- Canal
- died
- Tractor Accident
- UP
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!