UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Tractor Accident: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కాల్వలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తాజ్పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో బుధవారం నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. గురువారం మరో ఐదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులుండటం మరో విషాదం.
Read Also: Gandeevadhari Arjuna Twitter Review: ‘గాండీవధారి అర్జున’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Also Read
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలో ట్రాక్టర్-ట్రాలీ కాలువలో పడి నలుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది మరణించారు. ట్రాలీలో దాదాపు 50 మంది భక్తులను రాండువల్ గ్రామానికి ఒక మతపరమైన కార్యక్రమం కోసం తీసుకువెళుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకి తెలిపారు. మృతుల్లో సులోచన (58), మంగ్లేష్ (50), అదితి(5), అర్జున్ (12)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. నది యొక్క బలమైన ప్రవాహానికి అనేక మృతదేహాలు కొట్టుకుపోయాయి. సంఘటనా స్థలాన్ని సహరాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్, ఎస్పీ డాక్టర్ విపిన్ తడా సందర్శించారు. ఎస్పీ తడ గ్రామస్తులను ఆ మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్ ఎస్పీ మాటలను బేఖాతరు చేశారన్నారు. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి బుల్డోజర్ను స్థలానికి పిలిపించినట్లు SP తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితుల మరణాలపై సంతాపం వ్యక్తం చేశారు, బాధితుల కుటుంబాలకు తక్షణమే రూ. 4 లక్షలు మంజూరు చేయాలని సహరాన్పూర్ పరిపాలన అధికారులను ఆదేశించినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- Tags
- 9 People
- Canal
- died
- Tractor Accident
- UP
తాజావార్తలు
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..