UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
UP Tractor Accident: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కాల్వలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తాజ్పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో బుధవారం నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. గురువారం మరో ఐదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులుండటం మరో విషాదం.
Read Also: Gandeevadhari Arjuna Twitter Review: ‘గాండీవధారి అర్జున’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలోని రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలో ట్రాక్టర్-ట్రాలీ కాలువలో పడి నలుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది మరణించారు. ట్రాలీలో దాదాపు 50 మంది భక్తులను రాండువల్ గ్రామానికి ఒక మతపరమైన కార్యక్రమం కోసం తీసుకువెళుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకి తెలిపారు. మృతుల్లో సులోచన (58), మంగ్లేష్ (50), అదితి(5), అర్జున్ (12)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. నది యొక్క బలమైన ప్రవాహానికి అనేక మృతదేహాలు కొట్టుకుపోయాయి. సంఘటనా స్థలాన్ని సహరాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్, ఎస్పీ డాక్టర్ విపిన్ తడా సందర్శించారు. ఎస్పీ తడ గ్రామస్తులను ఆ మార్గంలో వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్ ఎస్పీ మాటలను బేఖాతరు చేశారన్నారు. రెస్క్యూ పనిలో సహాయం చేయడానికి బుల్డోజర్ను స్థలానికి పిలిపించినట్లు SP తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితుల మరణాలపై సంతాపం వ్యక్తం చేశారు, బాధితుల కుటుంబాలకు తక్షణమే రూ. 4 లక్షలు మంజూరు చేయాలని సహరాన్పూర్ పరిపాలన అధికారులను ఆదేశించినట్టు అధికారిక ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- Tags
- 9 People
- Canal
- died
- Tractor Accident
- UP
తాజావార్తలు
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!