Tiger: 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి.. 11 రోజులు శ్రమించి పట్టేశారు
- మధ్యప్రదేశ్లోని రైసెన్లో పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు
- పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులు.. 150 మంది సైనికులు
- 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి
- అంతకుముందు ఓ వ్యక్తి చంపి తిన్న టైగర్
మధ్యప్రదేశ్లోని రైసెన్లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్లో రాయల్ అర్బన్ టైగర్ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
Supreme Court: కోటా ఆత్మహత్యలకు సంబంధం లేదు.. నీట్ పిటిషన్లపై చురకలు
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
గత నాలుగు నెలలుగా.. పులి సంచారంతో రైసెన్ జిల్లా ప్రధాన కార్యాలయంతో పాటు చుట్టుపక్కల 36 గ్రామాల్లో భయాందోళనలతో గడుపుతున్నారు. గత 10 రోజులుగా.. రతపాని టైగర్ రిజర్వ్ ఆఫ్ రైసెన్, కన్హా టైగర్ రిజర్వ్, సత్పురా టైగర్ రిజర్వ్లలో 150 మంది సైనికుల బృందం 5 ఏనుగుల బృందంతో పాటు పులి కోసం కాపు కాస్తున్నారు. పులిని పట్టుకునేందుకు సైనికులు ఎండ వేడిమిలో అడవిలో తీవ్రంగా శ్రమించారు. దీంతో.. పులిని గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
Air Taxi: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ ప్రారంభం.. ఎక్కడంటే..
గురువారం రైసెన్ నగరానికి సమీపంలోని సురాయ్ అడవుల్లో పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో బృందాలు అక్కడికి చేరుకుని పులిని చుట్టుముట్టి రెండు ఇంజక్షన్లతో అపస్మారక స్థితికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. నెల క్రితం నీమ్ఖేడా నివాసి మణిరామ్ జాతవ్ అనే వ్యక్తిని పులి చంపి తింది. దాదాపు 6 నెలలుగా నగరం చుట్టుపక్కల ఉన్న అడవిలోనే పులి సంచరిస్తుంది. అయితే.. పులిని పట్టుకున్నారనే వార్త తెలియగానే జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకున్న తర్వాత కూడా జాగ్రత్తతో అడవుల్లోకి వెళ్లాలని DFO విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే రైసెన్ జిల్లాలో ఇప్పటికీ 70 కంటే ఎక్కువ పులులు రతపాని, రైసెన్ చుట్టుపక్కల అడవులలో ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పుడు పట్టుకున్న పులిని సత్పురా టైగర్ రిజర్వ్లో వదిలివేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!