Tiger: 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి.. 11 రోజులు శ్రమించి పట్టేశారు
- మధ్యప్రదేశ్లోని రైసెన్లో పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు
- పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులు.. 150 మంది సైనికులు
- 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి
- అంతకుముందు ఓ వ్యక్తి చంపి తిన్న టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని రైసెన్లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్లో రాయల్ అర్బన్ టైగర్ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
Supreme Court: కోటా ఆత్మహత్యలకు సంబంధం లేదు.. నీట్ పిటిషన్లపై చురకలు
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
గత నాలుగు నెలలుగా.. పులి సంచారంతో రైసెన్ జిల్లా ప్రధాన కార్యాలయంతో పాటు చుట్టుపక్కల 36 గ్రామాల్లో భయాందోళనలతో గడుపుతున్నారు. గత 10 రోజులుగా.. రతపాని టైగర్ రిజర్వ్ ఆఫ్ రైసెన్, కన్హా టైగర్ రిజర్వ్, సత్పురా టైగర్ రిజర్వ్లలో 150 మంది సైనికుల బృందం 5 ఏనుగుల బృందంతో పాటు పులి కోసం కాపు కాస్తున్నారు. పులిని పట్టుకునేందుకు సైనికులు ఎండ వేడిమిలో అడవిలో తీవ్రంగా శ్రమించారు. దీంతో.. పులిని గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
Air Taxi: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ ప్రారంభం.. ఎక్కడంటే..
గురువారం రైసెన్ నగరానికి సమీపంలోని సురాయ్ అడవుల్లో పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో బృందాలు అక్కడికి చేరుకుని పులిని చుట్టుముట్టి రెండు ఇంజక్షన్లతో అపస్మారక స్థితికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. నెల క్రితం నీమ్ఖేడా నివాసి మణిరామ్ జాతవ్ అనే వ్యక్తిని పులి చంపి తింది. దాదాపు 6 నెలలుగా నగరం చుట్టుపక్కల ఉన్న అడవిలోనే పులి సంచరిస్తుంది. అయితే.. పులిని పట్టుకున్నారనే వార్త తెలియగానే జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకున్న తర్వాత కూడా జాగ్రత్తతో అడవుల్లోకి వెళ్లాలని DFO విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే రైసెన్ జిల్లాలో ఇప్పటికీ 70 కంటే ఎక్కువ పులులు రతపాని, రైసెన్ చుట్టుపక్కల అడవులలో ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పుడు పట్టుకున్న పులిని సత్పురా టైగర్ రిజర్వ్లో వదిలివేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!