Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట.. ధనత్రయోదశి సందర్భంగా పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలో పూరీ జగన్నాథ స్వామిని ఎంతగానో ఆరాధిస్తారు. ఇక స్వామీ వారికి ఇష్టమైన పర్వదినాలలో ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది. అలానే ఈ రోజు కూడా స్వామి వారికి ఎంతో ప్రీతీ కరమైన రోజు కనుక భక్తులు అధికసంఖ్యలో గుడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం ధన త్రయోదశి.. స్వామి వారికి ప్రీతికరమైన ధన త్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుడిని చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకు వచ్చారు.
Read also:Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
Also Read
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
గాయపడిన వారిని పూరీ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఒడియా పంచాంగం ప్రకారం.. కార్తిక మాసం గత పౌర్ణమి నుంచి ప్రారంభం అయింది. కాగా ఈ రోజు కార్తిక శుక్రవారం తో పాటుగా ధన త్రయోదశి కలిసి వచింది. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయాన్నే స్వామికి ఇచ్చే మంగళ హారతిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అందరూ ఒకేసారి ఆలయంలో పలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులు ఆలయం మెట్లపై పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కుకుంటూ వెళ్లారు. దీనితో పలువురికి గాయాలు అయ్యాయి.
తాజావార్తలు
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
-
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!