Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట.. ధనత్రయోదశి సందర్భంగా పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలో పూరీ జగన్నాథ స్వామిని ఎంతగానో ఆరాధిస్తారు. ఇక స్వామీ వారికి ఇష్టమైన పర్వదినాలలో ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది. అలానే ఈ రోజు కూడా స్వామి వారికి ఎంతో ప్రీతీ కరమైన రోజు కనుక భక్తులు అధికసంఖ్యలో గుడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం ధన త్రయోదశి.. స్వామి వారికి ప్రీతికరమైన ధన త్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుడిని చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకు వచ్చారు.
Read also:Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
గాయపడిన వారిని పూరీ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఒడియా పంచాంగం ప్రకారం.. కార్తిక మాసం గత పౌర్ణమి నుంచి ప్రారంభం అయింది. కాగా ఈ రోజు కార్తిక శుక్రవారం తో పాటుగా ధన త్రయోదశి కలిసి వచింది. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయాన్నే స్వామికి ఇచ్చే మంగళ హారతిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అందరూ ఒకేసారి ఆలయంలో పలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులు ఆలయం మెట్లపై పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కుకుంటూ వెళ్లారు. దీనితో పలువురికి గాయాలు అయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?