Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట.. ధనత్రయోదశి సందర్భంగా పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలో పూరీ జగన్నాథ స్వామిని ఎంతగానో ఆరాధిస్తారు. ఇక స్వామీ వారికి ఇష్టమైన పర్వదినాలలో ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది. అలానే ఈ రోజు కూడా స్వామి వారికి ఎంతో ప్రీతీ కరమైన రోజు కనుక భక్తులు అధికసంఖ్యలో గుడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం ధన త్రయోదశి.. స్వామి వారికి ప్రీతికరమైన ధన త్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుడిని చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకు వచ్చారు.
Read also:Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
గాయపడిన వారిని పూరీ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఒడియా పంచాంగం ప్రకారం.. కార్తిక మాసం గత పౌర్ణమి నుంచి ప్రారంభం అయింది. కాగా ఈ రోజు కార్తిక శుక్రవారం తో పాటుగా ధన త్రయోదశి కలిసి వచింది. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయాన్నే స్వామికి ఇచ్చే మంగళ హారతిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అందరూ ఒకేసారి ఆలయంలో పలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులు ఆలయం మెట్లపై పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కుకుంటూ వెళ్లారు. దీనితో పలువురికి గాయాలు అయ్యాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!