Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Akhtar: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ హిందువులపై ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజం సహనంతో ఉందని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని ఆయన గురువారం అన్నారు. సమాజంలో అసహనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
హిందువులు ఉదారంగా, విశాల హృదయంతో ఉంటారని అన్నారు. కొంతమంది ఎప్పుడూ అసహనంతో ఉంటారని, హిందువులు అలా ఉండరని అది వారి గొప్ప గుణం అని అన్నారు. ‘వారికి గొప్ప గుణం, ఉదార, విశాల హృదయం ఉందని వాటిని కోల్పోకండి, లేకపోతే మీరు ఇతరులలా అవుతారు’ అని చెప్పారు.
Also Read
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
Read Also: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులపై స్పందించిన కెనడా..
భారతీయ ముస్లిం సమాజంలో అభ్యుదయ, ఉదారవాద వ్యక్తుల్లో జావేద్ అక్తర్ ఒకరిగా పరిగణించబడుతున్నారు. ముంబైలో రాజ్ ఠాక్రేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ కార్యకక్రమంలో జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘మేము హిందువుల జీవన విధానం నుంచి నేర్చుకున్నాము.. మీరు దాన్ని వదిలేస్తారా..?’ అని ప్రశ్నించారు.
రాముడు, సీతాదేవి జన్మించిన ఈ భూమిలో జన్మించినందుకు మేం గర్వపడుతున్నామని, తాను నాస్తికుడిని అయితే, రాముడు, సీతదేవిని ఈ దేశ సంపదగా భావిస్తున్నానని అన్నారు. రామాయణం మన సాంస్కృతిక వారసత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘జై సియారాం’ అని నినదించారు. భావ ప్రకటన స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు సినిమా తీస్తే హేమామాలిని, ధర్మేంద్ర గుడిలో డైలాగ్స్పై పెద్ద వివాదం వచ్చేదని అన్నారు. హిందూ సంస్కృతి, నాగరికత మనకు ప్రజాస్వామ్య వైఖరిని నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మనమే కరెక్ట్, ఇతరులు తప్పు అని హిందువులు భావించరని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!