Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Akhtar: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ హిందువులపై ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజం సహనంతో ఉందని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని ఆయన గురువారం అన్నారు. సమాజంలో అసహనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
హిందువులు ఉదారంగా, విశాల హృదయంతో ఉంటారని అన్నారు. కొంతమంది ఎప్పుడూ అసహనంతో ఉంటారని, హిందువులు అలా ఉండరని అది వారి గొప్ప గుణం అని అన్నారు. ‘వారికి గొప్ప గుణం, ఉదార, విశాల హృదయం ఉందని వాటిని కోల్పోకండి, లేకపోతే మీరు ఇతరులలా అవుతారు’ అని చెప్పారు.
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
Read Also: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులపై స్పందించిన కెనడా..
భారతీయ ముస్లిం సమాజంలో అభ్యుదయ, ఉదారవాద వ్యక్తుల్లో జావేద్ అక్తర్ ఒకరిగా పరిగణించబడుతున్నారు. ముంబైలో రాజ్ ఠాక్రేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ కార్యకక్రమంలో జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘మేము హిందువుల జీవన విధానం నుంచి నేర్చుకున్నాము.. మీరు దాన్ని వదిలేస్తారా..?’ అని ప్రశ్నించారు.
రాముడు, సీతాదేవి జన్మించిన ఈ భూమిలో జన్మించినందుకు మేం గర్వపడుతున్నామని, తాను నాస్తికుడిని అయితే, రాముడు, సీతదేవిని ఈ దేశ సంపదగా భావిస్తున్నానని అన్నారు. రామాయణం మన సాంస్కృతిక వారసత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘జై సియారాం’ అని నినదించారు. భావ ప్రకటన స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు సినిమా తీస్తే హేమామాలిని, ధర్మేంద్ర గుడిలో డైలాగ్స్పై పెద్ద వివాదం వచ్చేదని అన్నారు. హిందూ సంస్కృతి, నాగరికత మనకు ప్రజాస్వామ్య వైఖరిని నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మనమే కరెక్ట్, ఇతరులు తప్పు అని హిందువులు భావించరని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..