Supreme Court: తమిళనాడు గవర్నర్కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
- తమిళనాడు గవర్నర్కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
- బిల్లులు ఆమోదించకుండా నిలిపివేయడంపై అసహనం
- ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ ధర్మాసనం వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. 15 రోజులకే భర్తకు దిమ్మతిరిగే షాకిస్తూ..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
స్టాలిన్ ప్రభుత్వం పంపించిన 10 కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్.రవి అడ్డుకున్నారు. ఈ చర్యను స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా విచారించిన న్యాయస్థానం.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యలు పక్కన పెడుతున్నట్లు కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trump-Musk: చైనా సుంకాలపై మస్క్ అభ్యంతరం.. ట్రంప్నకు కీలక సూచన
10 బిల్లులను రిజర్వ్ చేయాలని రాష్ట్రపతికి గవర్నర్ సూచించారు. కీలక బిల్లులు ఆమోదం పొందక పోవడంతో స్టాలిన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఆశ్రయించడంతో సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యను పక్కన పెడుతూ.. గవర్నర్ నిలిపివేసిన దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను.. మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఆమోదించి పంపితే గవర్నర్ ఆమోదించినట్లుగా పరిగణించాలని న్యాయస్థానం తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాశ్వతంగా గవర్నర్లు తమ దగ్గర ఉంచుకోలేరని తేల్చి చెప్పింది. అయినా బిల్లులను ఆమోదించకుండా.. రాష్ట్రపతికి పంపించడం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించినట్లుగా కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 2020, జనవరి నుంచి 12 బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం ఇది కచ్చితంగా చట్ట విరుద్ధమని సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?