Srilanka Crisis: శ్రీలంక సంక్షోభంపై జై శంకర్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
indian Government holds all party meeting on Sri Lanka crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
అంతకుముందు ఆదివారం పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన సమావేశంలో తమిళ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు శ్రీలంక సంక్షోభంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరాయి. శ్రీలంకలో తమిళ జనాభా పరిస్థితితో పాటు రాష్ట్రంలోకి శరణార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో తమిళ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీకి, విదేశాంగ శాఖ జైశంకర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ శ్రీలంకలో తమిళ ప్రజల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకల సంక్షోభ సమయంలో సహాయక సామాగ్రిని పంపించాలని సీఎం స్టాలిన్, కేంద్రాన్ని కోరారు.
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Read Also: Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్
సంక్షోభ సమయంలో శ్రీలంకకు 3.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు భారత్ అందించింది. సంక్షోభ సమయంలో ఏ దేశం శ్రీలంకను ఆదుకోకపోగా.. ఇండియానే శ్రీలంకకు సాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే శ్రీలంకకు నిత్యావసరాలు, ఇంధనం, ఎరువులు, ఔషధాలను ఇండియా అందించింది. వీటి విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం భారత్ తమకు సాయం చేయాలని కోెరుతోంది. అక్కడి క్రికెటర్లు భారత్ ను శ్రీలంకకు పెద్దన్నగా పేర్కొంటూ..ఆపద సమయంలో తమకు అండగా నిలిచినందుకు ప్రశంసలు కురిపిస్తోంది. చివరకు డ్రాగన్ దేశం చైనా కూడా భారత్ సాయాన్ని కొనియాడింది. ఇదిలా ఉంటే రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీలంక గత ఏడు దశాబ్ధాల్లో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంకలో గత ఆదివారంతో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!