Congress: ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు చేయనున్నారని న్యూస్ వైరల్గా మారిపోయింది.. ఇక, రేపు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి సీడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది.. సోనియా గాంధీ అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలోనే సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామాలను సమర్పించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న నేతలో ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిన విషమయే..
Read Also: Phone Tapping Case: మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు.. రేపు విచారణకు రండి..
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
బీజేపీ నిర్ణయాత్మకంగా గెలిచిన ఉత్తరప్రదేశ్లో, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ నాల్గో స్థానంలో నిలిచింది. పంజాబ్లో, గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేతిలో ఓడిపోగా, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్లలో బీజేపీ చేతిలో ఓడిపోయింది… ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ, ఆయన సోదరి మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాత్రమే స్టార్ క్యాంపెయినర్లు కావడంతో పార్టీ పేలవమైన పనితీరు రాహుల్ గాంధీ నాయకత్వానికి తీవ్రమైన సవాలుగా మారినట్టు అయ్యింది.. ఇక, కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు తమ వ్యూహాన్ని రూపొందించడానికి జీ-23, సంస్థాగత సమగ్రతను డిమాండ్ చేస్తున్న నాయకులు, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నివాసంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో పార్టీ ఓటమి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దిద్దుబాటు చర్యలను జీ-23 సూచించినందున.. రేపటి సమావేశంలో జి-23 నుండి మరికొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రబలమైన శక్తిగా ఉండి.. పంజాబ్లో ఆప్ చేతిలో ఓటమి, రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లోని 403 సీట్లకు గాను కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవడంతో కాంగ్రెస్ పతనం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్లలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. సాధారణ ఎన్నికలలో దాని సంఖ్య గణనీయంగా క్షీణించిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్లలో సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..