Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు హైదరాబాద్కు రానున్నారు. దేశ రక్షణ రంగంలో కీలక మైలురాళ్లు, మేధావులతో చర్చలు, వాయుసేన అకాడమీలో పరేడ్ వంటి వరుస కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ అత్యంత బిజీగా సాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నాయి. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 26కు చేరుకుని, మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
అనంతరం రక్షణ రంగ పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆయన DRDLకు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రతిష్టాత్మకమైన ‘కుషా కాంప్లెక్స్’ను ప్రారంభించి, అత్యాధునిక ల్యాబొరేటరీలను సందర్శించి శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తారు. సాయంత్రం వేళ గాయత్రి గార్డెన్స్లో నిర్వహించే మేధావుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన 12 ఏళ్ల సుపరిపాలన, దేశాభివృద్ధిపై మేధావులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. రాత్రి 6:25 గంటలకు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుని, అక్కడ శిక్షణ పొందుతున్న క్యాడెట్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేసి, అకాడమీలోని ‘రాష్ట్రకూట్’ భవనంలో రాత్రి బస చేస్తారు.
Also Read
- ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
రేపు ఉదయం రాజ్నాథ్ సింగ్ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత గగనతల రక్షణ కవచంలో కొత్తగా చేరబోతున్న యోధుల పరేడ్ను సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేస్తారు. ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమం ముగిసిన అనంతరం, ఉదయం 11:10 గంటలకు అకాడమీ నుంచి నేరుగా ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!