2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
- మరో ఏడాదిలో 2027 వన్డే ప్రపంచకప్
- మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచనలు
- హార్దిక్ పాండ్యాకు సరైనప్రత్యామ్యాయం నితీశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India 2027 ODI World Cup Planning: 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ఇప్పటి నుంచే కీలక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. ముఖ్యంగా తరచూ గాయాల బారిన పడుతున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం భారత జట్టు యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నాడు. జియోస్టార్ నిర్వహించిన ‘ఫాలో ద బ్లూస్’ కార్యక్రమంలో మాట్లాడిన రైనా.. హార్దిక్ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, అయితే అతని ఫిట్నెస్ సమస్యలు భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశమని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి హార్దిక్కు సరైన బ్యాకప్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
నితీశ్ రెడ్డి సరైనోడు:
తెలుగు ఆటగాడు, యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ప్రశంసించాడు. ‘బ్యాటింగ్లో నితీశ్ మరింత పరిణతి సాధించాడు. ఐపీఎల్లో బాగా బౌలింగ్ చేస్తూ నియంత్రణను కూడా ప్రదర్శించాడు. అతని ఫిట్నెస్ కూడా మెరుగ్గా ఉంది. అయితే నితీశ్ పనిభారాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తూ నిరంతరం అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత జట్టు యాజమాన్యంపై ఉంది’ అని రైనా చెప్పాడు. 2027 ప్రపంచకప్లో భారత జట్టు విజయావకాశాలకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టోర్నమెంట్లలో వీరిద్దరికీ అపార అనుభవం ఉందని, కీలక మ్యాచ్ల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసని రైనా చెప్పాడు.
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
గిల్కు రో-కోల సలహాలు:
ప్రస్తుతం భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్మన్ గిల్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల మద్దతు ఎంతో ఉపయోగపడుతుందని సరేష్ రైనా పేర్కొన్నాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో కెప్టెన్గా వ్యవహరించే గిల్కు రో-కోల సలహాలు, అనుభవం గొప్ప బలంగా నిలుస్తాయని వివరించాడు. మరోవైపు మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా గిల్ నాయకత్వాన్ని ప్రశంసించాడు. ఐపీఎల్లో గిల్ బౌలర్లను సమర్థవంతంగా వినియోగించాడని, స్పిన్నర్లను సరైన సమయంలో ఉపయోగించడంతో పాటు ఒత్తిడి పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కొన్నాడని చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ అతని బ్యాటింగ్ ఫామ్ ఏమాత్రం తగ్గలేదని కొనియాడాడు.
గిల్కు మార్గనిర్దేశం:
శుభ్మన్ గిల్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల సహకారం లభిస్తుండటం కూడా పెద్ద ప్లస్ పాయింట్ అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఫీల్డ్ సెట్టింగ్స్, బౌలింగ్ మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల్లో వారు గిల్కు మార్గనిర్దేశం చేయగలరని, దీంతో కెప్టెన్గా అన్ని బాధ్యతలను ఒంటరిగా మోయాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ను వన్డే జట్టులో ఎంపిక చేయడాన్ని కూడా కుంబ్లే స్వాగతించాడు. ఐపీఎల్తో పాటు దేశీయ క్రికెట్లో అతను చూపిన ప్రతిభ ఆధారంగానే ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. కట్టర్లు, స్లోవర్ బాల్స్, యార్కర్లు వంటి వైవిధ్యమైన బౌలింగ్ ఆయుధాలు అతని బలమని కుంబ్లే వివరించాడు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!