Himachal Pradesh: భారీ ఈదురుగాలులు.. ఆరుగురు మృతి
- హిమాచల్ప్రదేశ్లో భారీ ఈదురుగాలులు
- ఆరుగురు మృతి.. ఐదుగురికి గాయాలు
హిమాచల్ప్రదేశ్లో ఆకస్మాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఒక్కసారిగా భీకరమైన ఈదురుగాలులు ఏర్పడ్డాయి. దీంతో భారీ వృక్షాలు నేలకూలిపోయియి. అంతేకాకుండా కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాయలు దొర్లుకుంటూ వచ్చి కార్లపై పడ్డాయి. దీంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. మణికరణ్ గురుద్వారా ముందు రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలి ఆరుగురు చనిపోయారు. కొండచరియలు కూడా విరిగిపడ్డాయ. అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: 84 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం..
Also Read
ఆదివారం బలమైన గాలులకు చెట్లు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని కులులోని మణికరణ్ గురుద్వారా పార్కింగ్ సమీపంలో వాహనాలు, కిరణా దుకాణాలపై పడిపోవడంతో కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఇక ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని జారిలోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ వారం ప్రారంభంలో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు, ఈదురుగాలులు వీస్తాయని ముందుగానే వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో ఉంటాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Earthquake: టోంగా దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
తాజావార్తలు
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!