కర్ణాటక కాంగ్రెస్లో అధికార మార్పుపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య కుర్చీ పంచాయితీ నడుస్తోంది. గతంలో హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి. అనంతరం బెంగళూరుకు బ్రేక్ ఫాస్ట్లకు మారాయి. ఒక రోజు సిద్ధరామయ్య ఇంట్లో.. మరొక రోజు డీకే.శివకుమార్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్లు జరిగాయి. అనంతరం కొంత కాలంగా స్తబ్దతగా ఉంది.
మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఇప్పుడు మళ్లీ పంచాయితీ మొదలైంది. ఇప్పటికే ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో శివకుమార్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా దళిత కార్డ్ పైకి వచ్చింది. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు
ఈ గందరగోళం మధ్య సిద్ధరామయ్య ఇబ్బంది పడుతున్నారో.. ఏమో తెలియదు గానీ మెత్తబడినట్లుగా తెలుస్తోంది. అధికార మార్పుపై తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్దేనని.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని చెప్పారు. మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నలు వేయడంతో విసుగెత్తినట్లున్నారు. హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇతరుల కామెంట్లపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17న సిద్ధరామయ్యను..శివకుమార్ను ఢిల్లీకి పిలవవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: PM Modi: అస్సాంలో మోడీ పర్యటన.. మోరన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం