Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
- 2027 యూపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కొత్త రాజకీయ వ్యూహం.
- చంద్రశేఖర్ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీలతో పొత్తుకు ప్లాన్.
- బీజేపీని ఒంటరిగా ఓడించలేమన్న కాంగ్రెస్ ఎంపీ.
- ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల్లో విభేదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుల చర్చలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కలిసి పోటీ చేయాలని భావించాయి. అయితే, సీట్ల పంపకాలపై చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో కొత్త పొత్తుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్, అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎంతో, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ, చంద్రశేఖర్ అజాద్ తన స్నేహితులుగా అభివర్ణించారు. యూపీలో బీజేపీని ఎవరూ ఒంటరిగా ఓడించలేరని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మద్దతు లేకుండా బీజేపీని ఎవరూ ఓడించలేరని చెప్పారు. కొత్త పొత్తుల గురించి కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యూపీలో ఓవైపు ఎస్పీ మద్దతు వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేనప్పటికీ, మరోవైపు ఓవైసీ, ఆజాద్లను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైసీని తన అన్నయ్యగా మసూద్ పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఎంఐఎంను బీజేపీ బీ-టీమ్ అని ఆరోపిస్తోంది.
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
అఖిలేష్పై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇలా మాట్లాడుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికే ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపిణీ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో అఖిలేష్ యాదవ్ పార్టీపై మరింత ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తుందనే ఆరోపణ కూడా ఉంది. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ రెండింటికి ప్రధాన ఓటు బ్యాంక్ ముస్లింలే. విడివిడిగా పోటీ చేస్తే ఈ ఓట్లు చీలుతాయి. ఈ నేపథ్యంలో ఎస్పీని దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ఈ ఎత్తుగడను వాడుకుంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
-
Isakapatnam: తెలుగు వెబ్ సిరీస్కు దేశవ్యాప్తంగా క్రేజ్… టాప్ 3లో దూసుకెళ్తున్న ‘ఇసకపట్నం’..
-
Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
-
Sai Krishna Case Updates: సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు.. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
-
Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!