DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..
- రాహుల్ గాంధీపై డీఎంకే అధికార పత్రిక మురసోలి తీవ్ర విమర్శలు.
- తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపణ.
- కేరళ ప్రచారంలో పినరయిపై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సీపీఎం నేత, మాజీ సీఎం పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన వల్ల బీజేపీకి లాభం చేకూరుతోందని విమర్శించారు. తాజాగా, డీఎంకే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్నికల అనంతరం విజయ్తో చేతులు కలిపింది. ఈ పరిణామాలపై డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షత వహించిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే వెళ్లలేదు.
ఇడిలా ఉంటే, డీఎంకే అధికారిక పత్రిక మురసోలిలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను వెన్నుపోటు పొడించిందని ఆరోపించింది. రాహుల్ గాంధీ వల్లే ఇలాంటి రాజకీయ పరిణామాలు జరిగాయని చెప్పింది. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని డీఎంకే తప్పుపట్టింది. పినరయి విజయన్, ప్రధాని మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని వామపక్షాలు ఖండించాయి.
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ఇండియా కూటమిలో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కూడా కాంగ్రెస్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిందని మురసోలి పేర్కొంది. డీఎంకే, ఆప్ వంటి కీలక మిత్రపక్షాలు దూరం కావడం ఇండియా కూటమిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బగా అభివర్ణించింది. బీహార్లో అనేక అంశాలపై కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మధ్య రహస్య అవగాహనలు ఉన్నాయేమోనని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారని, ఈ విషయాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు రాలేదని మురసోలి ఆరోపించింది.
ఇండియా కూటమి సమావేశంలో బీజేపీ వ్యతిరేక కన్నా కాంగ్రెస్ వ్యవహారశైలి పైనే అసంతృప్తి ఎక్కువగా ఉందనే వార్తలు వినిపించాయి. రాహుల్ గాంధీ అపరిపక్వత, మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు కారణమని డీఎంకే అధికారిక పత్రిక ఆరోపించింది. కూటమిలో విభేదాలకు బాధ్యత రాహుల్ గాంధీ తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాహుల్ తీరు వల్ల బీజేపీకే లాభం చేకూరుతోందని మురసోలి అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!