Shashi Tharoor: రాహుల్ గాంధీ అంగీకరించలేదు.. అందుకే!
Shashi Tharoor Reveals Sensational Secrets: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఇటీవల ఆయన్ను ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని కథనాలు చక్కర్లు కొట్టాయి. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని శశిథరూర్ తాజాగా స్పష్టం చేశారు. కానీ.. కొందరు సీనియర్లు మాత్రం తనపై కంప్లైంట్ చేశారన్న మరో షాకింగ్ విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రివీల్ చేశారు. అధ్యక్ష పదవికి తాను సరితూగనని, నామినేషన్ను ఉపసింహరించుకునేలా తనని విజ్ఞప్తి చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కొందరు సీనియర్ నేతలు కోరారని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే తనతో చెప్పారని శశి థరూర్ పేర్కొన్నారు.
‘‘ఇటీవల రాహుల్ గాంధీతో సంబాషణ జరిపినప్పుడు.. నన్ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని రాహుల్ని కొందరు సీనియర్లు కోరారట. కానీ, రాహుల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకీ మేలు జరుగుతుందని తాను భావిస్తున్నట్టు.. రాహుల్ వారికి వివరించారని చెప్పారు. పైగా.. పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్ల నుంచి చెప్తున్నానంటూ.. ఆయనకు నాకు గుర్తు చేశారు’’ అని శశిథరూర్ తెలిపారు. తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్.. సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదని బాంబ్ పేల్చారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఏ ఒక్కరినీ తగ్గించి మాట్లాడనని థరూర్ అన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలావుండగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం.. మార్పు నినాదంతో శశిథరూర్ ప్రచారం నిర్వహిస్తుండగా, దళిత మార్క్తో మలికార్జున ఖర్గే బరిలో దిగుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!