Shashi Tharoor: రాహుల్ గాంధీ అంగీకరించలేదు.. అందుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor Reveals Sensational Secrets: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఇటీవల ఆయన్ను ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని కథనాలు చక్కర్లు కొట్టాయి. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని శశిథరూర్ తాజాగా స్పష్టం చేశారు. కానీ.. కొందరు సీనియర్లు మాత్రం తనపై కంప్లైంట్ చేశారన్న మరో షాకింగ్ విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రివీల్ చేశారు. అధ్యక్ష పదవికి తాను సరితూగనని, నామినేషన్ను ఉపసింహరించుకునేలా తనని విజ్ఞప్తి చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కొందరు సీనియర్ నేతలు కోరారని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే తనతో చెప్పారని శశి థరూర్ పేర్కొన్నారు.
‘‘ఇటీవల రాహుల్ గాంధీతో సంబాషణ జరిపినప్పుడు.. నన్ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని రాహుల్ని కొందరు సీనియర్లు కోరారట. కానీ, రాహుల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకీ మేలు జరుగుతుందని తాను భావిస్తున్నట్టు.. రాహుల్ వారికి వివరించారని చెప్పారు. పైగా.. పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్ల నుంచి చెప్తున్నానంటూ.. ఆయనకు నాకు గుర్తు చేశారు’’ అని శశిథరూర్ తెలిపారు. తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్.. సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదని బాంబ్ పేల్చారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఏ ఒక్కరినీ తగ్గించి మాట్లాడనని థరూర్ అన్నారు.
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
ఇదిలావుండగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం.. మార్పు నినాదంతో శశిథరూర్ ప్రచారం నిర్వహిస్తుండగా, దళిత మార్క్తో మలికార్జున ఖర్గే బరిలో దిగుతున్నారు.
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!