కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టికర్త మోడీయే.. దీదీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్కడ ఏకంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక, ఎన్నికల ముందు నుంచీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన టీఎంసీ అధినేత, సీఎం మమతాబెనర్జీ.. అసలు కరోనా సెకండ్ సృష్టించింది మోడీయే నంటూ ఫైర్ అయ్యారు.
ఇవాళ దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని బాలూర్ఘాట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన మమతా బెనర్జీ.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడానికి ప్రధాని మోడీయే కారణమని ఆరోపించారు. సెకండ్ వేవ్ను మోదీ సృష్టించిన విపత్తుగా కామెంట్ చేశారు.. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోందని.. నేను దీనిని మోడీ సృష్టించిన విప్తే అంటాను అంటూ పేర్కొన్నారు దీదీ.. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ఆస్పత్రుల్లో సరిపడా ఇంజెక్షన్లు లేవు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా.. కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!