Sanjay Raut: ముఖ్యమంత్రి కొడుకు నుంచి నాకు ప్రాణహాని.. రక్షణ కల్పించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut Claims Threat To Life: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. లోక్ సభ ఎంపీ శ్రీకాంత్ షిండే(ఏక్ నాథ్ షిండే కుమారుడు) నన్ను చంపేందుకు థానేకు చెందిన నేరస్థుడు రాజా ఠాకూర్కు సుపారీ ఇచ్చాడని..బాధ్యత కలిగిన పౌరుడిగా మీకు తెలియజేస్తున్నా అని పోలీసులకు లేఖ రాశారు. అయితే సంజయ్ రౌత్ ఆరోపనలను అధికార పార్టీ తోసిపుచ్చింది. ఇది చౌకబారు స్టంట్ గా అభివర్ణించింది.
దీనిపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సంజయ్ రౌత్ కు ఆలోచనలు లేని ఆరోపణలు చేసే అవకాశం ఉందని, అయితే సంబంధిత అధికారులను సమీక్షించమని కోరతా అని ఆయన అన్నారు. సంజయ్ రౌత్ ముంబై కమిషనర్ తో పాటు హోంశాఖను నిర్వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు, థానే పోలీసులకు లేఖలు రాశారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని ఉద్దవ్ ఠాక్రే కొడుకు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కోరారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
Read Also: Earthquake: త్వరలో హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ భూకంపాలకు అవకాశం..
ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సాత్ మాట్లాడుతూ.. సానుభూతి పొందేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాంత్ షిండే ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయరని అన్నారు. ఈ లేఖపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. సంజయ్ రౌత్ ఆరోపణలను బుద్ది లేని ఆరోపణలుగా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారని, దాని వల్ల తనకు కాస్త సానుభూతి వస్తుందని అనుకోవచ్చని ఎద్దేవా చేశారు.
ఇటీవల శివసేన పార్టీని దాని ఎన్నిలక చిహ్నం ‘విల్లు-బాణం’ని ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో రూ.2000 కోట్ల లావాదేవీలు సాగాయని ఆరోపించారు సంజయ్ రౌత్. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, ఎంపీలకు రూ. 100 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!