S JaiShankar: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంపై జైశంకర్ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar on Pakistan economic crisis: పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. తమ దేశం ఇప్పటికే దివాళా తీసిందని సాక్షాత్తు అక్కడి మంత్రులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. క్లిష్ట సమయంలో ఐఎంఎఫ్ కానీ, పాక్ మిత్రదేశాలు అయిన సౌదీ, యూఏఈ, చైనా వంటివి కూడా పాకిస్తాన్ కు సాయాన్ని అందించేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు రాజకీయ అస్థిరత కూడా పాకిస్తాన్ పరిస్థితి దిగజారడానికి కారణం అయింది. ఐఎంఎఫ్ తన షరతులకు అంగీకరిస్తేనే తప్పా పాకిస్తాన్ కు బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తామని స్పష్టం చేసింది.
Read Also: Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. శాంతి నెలకొనేదెప్పుడు..?
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఇదిలా ఉంటే పలువరు పాకిస్తాన్ జర్నలిస్టులు, మాజీ సైనికాధికారులు భారత్, పాకిస్తాన్ ను ఆదుకోవాలని కోరుతున్నాయి. దీనిపై ఇప్పటికే భారత్ స్పష్టతతో ఉంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ కు శ్రీలంక లాగా, పాకిస్తాన్ కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా డైలాగ్లో మాట్లాడుతూ పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి ప్రస్తావించారు.
ఒక దేశం తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్నట్లే, రాజకీయా, సామాజిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఒక దేశం ప్రాథమిక పరిశ్రమ ఉగ్రవాదం అయితే ఆ దేశం క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడదని, సంపన్నదేశంగా మారదని పాకిస్తాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేకుంటే ఇతరులు పరిష్కరించలేదని అన్నారు. ఏ దేశం కూడా తమ పొరుగు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండాలని కోరుకోదని తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యనే ఎదుర్కొందని అయితే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో సమస్య నుంచి బయటపడిందని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసియా ప్రాముఖ్యత పెరుగుతోందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!