PM Modi: మోడీ అపాయింట్మెంట్పై షరతులు.. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటేనే పర్మిషన్
- మోడీ అపాయింట్మెంట్పై షరతులు
- కోవిడ్ టెస్ట్ చేయించుకుంటేనే పర్మిషన్
- ఢిల్లీ సీఎం సహా పలువురు టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం కూడా అప్రమత్తం అయింది. ఇకపై ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని పీఎంవో సూచించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్
Also Read
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
- Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
- Vijay's Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
పీఎంవో సూచన మేరకు బుధవారం సాయంత్రం ప్రధాని మోడీని కలవనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోనున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల పార్టీ నాయకులకు రాత్రి 7:30 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: రాజాను పెళ్లి చేసుకోను.. ప్రియుడితోనే ఉంటాను.. తల్లిని హెచ్చరించిన సోనమ్
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో పాటు ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121లకు చేరింది. దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్ కేసులు ఉండగా.. గుజరాత్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.