Ramesh Bidhuri: “నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు”.. బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు..
- నన్ను గెలిపిస్తే ప్రియాంకా గాంధీ చెంపల్లాంటి రోడ్లు..
- బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- మండిపడుతున్న కాంగ్రెస్, ఆప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది.
ఢిల్లీలోని కల్కాజీ నుంచి బిధూరి పోటీ చేస్తున్నారు. బీజేపీని “మహిళా వ్యతిరేక పార్టీ”గా అభివర్ణించిన కాంగ్రెస్, బిధూరి వ్యాఖ్యలు “సిగ్గుచేటు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు అతడి వికారమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. బీజేపీ అసలు రూపం ఇదే అని, పార్టీ అగ్రనాయకత్వం చేతులు జోడించి ప్రియాంకాగాంధీని క్షమించాలని కోరాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: George Soros: జార్జ్ సోరోస్కి యూఎస్ అత్యున్నత పురస్కారం.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..
తాను ఈ వ్యాఖ్యలను చేశారని రమేష్ బిధూరి చెప్పారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమా మాలిని చెంల వలే స్మూత్గా మారుస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ ఈ రోజు కాంగ్రెస్ నా ప్రకటనతో బాధపడుతుంటే, హేమమాలిని విషయంలో ఏం వారు ఏం చేశారు..? ఆమె పేరు పొందిన ఒక కథానాయిక, సినిమాల ద్వారా భారతదేశానికి కీర్తి చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యల్ని వారు ప్రశ్నించకపోతే, నా వ్యాఖ్యల్ని ఎలా ప్రశ్నిస్తారు.?’’ అని అన్నారు. హేమమాలిని మహిళ కాదా..? ప్రియాంకా గాంధీ కన్నా ఆమె ఎక్కువ ఖ్యాతిని సాధించారు అని బిధూరి అన్నారు.
బిధూరి వ్యాఖ్యల్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఖండించారు. మహిళల పట్ల బీజేపీకి ఉన్న గౌరవం ఇది అంటూ ట్వీట్ చేశారు. బిధూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2023లో లోక్సభలో అప్పటి బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై తర్వాత బిధూరి విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!