Goa: ఫలితాలపై ఉత్కంఠ.. క్యాంపులకు అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఒక్కసారిగా గోవాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముందు జాగ్రత్తగా, కాంగ్రెస్ తన అభ్యర్థులందరినీ క్యాంప్లకు తరలించారు.. ఇవాళ ఒక రిసార్ట్ నుంచి మరొక రిసార్ట్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తలరించారు.. గోవా ఫలితాలు, ఆ తర్వాత పరిణామాల పర్యవేక్షణ కోసం ఇప్పటికే గోవా చేరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివ కుమార్.. ఇక, బీజేపీ నేతలకు కూడా రంగంలోకి దిగుతున్నారు.. ఇవాళ రాత్రికి గోవాకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటు ఇతర నేతలు… ఇప్పటికే ఎంజీపీ, బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులతో టచ్ లోకి వెళ్లిపోయారు బీజేపీ నేతలు..
Read Also: Gun Firing: సిద్దిపేటలో కాల్పుల కలకలం
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఇక, బీజేపీకి చెందిన ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ పూర్తవ్వగా, ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచేందుకు సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు పి.చిదంబరం, రాష్ట్ర ఇన్చార్జి దినేశ్ గుండూరావు, డీకే శివకుమార్ ఆదివారం నుంచి గోవాలోనే ఉన్నారు. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఫలితాల అనంతరం గెలిచిన వారు పార్టీ కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది అని చెబుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతుల.. మరోవైపు.. గోవాలో గెలిచే ప్రతి సీటూ కీలకమైంది కావడంతో టీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తోంది. వాటికి ఆస్కారం లేకుండా ఎత్తుగడలు వేస్తోంది.. కాగా, 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 16 సీట్లు గెలుచుకుంటాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సంఖ్య మాత్రం 21. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టి రాష్ట్రంలో మొదటిసారిగా అభ్యర్థులను బరిలోకి దించిన టీఎంసీకి మూడు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దీంతో, గోమంతక్ పార్టీ, టీఎంసీలతోపాటు ఆప్తోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది.. మరి రేపు ఫలితాలు ఎలా ఉంటాయి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగ మారింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!