Digital Rupee: డిజిటల్ రూపాయి.. రేపే మార్కెట్లోకి.. విశేషాలేంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI to launch Digital Rupee on Dec 1 in four cities: కాలానికి అనుగుణంగా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త ఒరవళ్లు రూపుదాల్చుకుంటున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా డిజిటల్ రూపాయి వచ్చింది. రేపటి నుంచే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ డిజిటల్ రూపాయి కోసం ఆర్బీఐ.. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లోని ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, యస్ బ్యాంక్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిని ‘ఈ-రూపాయి’గా కూడా వ్యవహరిస్తారు. అయితే.. ఇది తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ)కు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
అసలు ఈ డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? ఇదేమీ క్రిప్టో కరెన్సీ కాదు. చట్టపరమైన టెండర్ను సూచించే డిజిటల్ టోకెన్ మరో రూపమే ఇది. మన పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే.. దీనికీ విలువ ఉంటుంది. వినియోగదారులు, వ్యాపారులకు.. బ్యాంకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా.. ఈ-రూపాయితో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. లేకపోతే.. మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. చివరికి.. వ్యక్తి, వ్యాపారి మధ్య కూడా ఈ డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎలాగైతే ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి.. ఆ తరహాలోనే ఈ-రూపాయితో చెల్లింపులు జరుపుకోవచ్చు. ఈ డిజిటల్ రూపాయిని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచితే.. వడ్డీ లభిస్తుంది.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. ప్రస్తుతం నాలుగు నగరాల్లో మాత్రమే ఈ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఈ-రూపాయిని విస్తరించనున్నట్టు వెల్లడించింది. దశల వారీగా.. ఇతర నగరాలకు కూడా విస్తరిస్తారు. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అందబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!