Madhya Pradesh: రేప్ కేసులో పదేళ్లు జైల్లో ఉన్నాడు.. విడుదలై మళ్లీ అదేపని చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అత్యాచారం కేసులో పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అదే నేరానికి పాల్పడ్డాడు. జైలు నుంచి విడుదలైన నిందితుడు సాత్నాలో 5 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితులపై లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read also: LB Nagar Police: స్వతంత్రమా నువ్వెక్కడా.. రాత్రంతా పోలీస్ స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీ
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
10 ఏళ్ల జైలు శిక్ష నిందితుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. మానసిక సంస్కరణ లేదు, జైలు జీవితం మంచి జీవితానికి సంకేతం కాదు. ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన అతడు తాజాగా మరో మైనర్పై అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్లో అమ్మమ్మతో చిన్నారి ఉంటుంది. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు కనిపించకుండా పోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి అమ్మమ్మ బాలికను కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో అకస్మారిక స్థితిలో బాలిక కనిపించింది. ఇది చూసిన బాలిక అమ్మమ్మ అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు బాలికతో పాటు ఆటో ఎక్కి కృష్ణానగర్ వైపు పరారయ్యాడు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సిటీ కొత్వాల్ శంఖధర్ ద్వివేది తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read also: kingfisher Beer : కింగ్ ఫిషర్ ప్రియులకు షాకింగ్ న్యూస్… ఆ బీర్ తాగితే ప్రమాదం
బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు రెండు గంటల పాటు వెతికినా బాలిక ఆచూకీ లభ్యమైంది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం రేవాలోని సంజయ్ గాంధీ వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు. కోల్గ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2012లో నాలుగున్నరేళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని, అందుకు కోర్టు అతనికి పదేళ్ల శిక్ష విధించిందని పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే జైలులో సత్ప్రవర్తన కారణంగా మూడేళ్ల శిక్ష రద్దు కావడంతో 18 నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. విడుదలైన ఏడాదిన్నర తర్వాత నిందితుడు మరో మైనర్ బాలికపై అదే నేరానికి పాల్పడ్డాడు. బాలికను చాక్లెట్ ఆశ చూపించి తనపై అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. బాలికను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అన్నారు.
Madhya Pradesh: ఖాకీల కర్కశత్వం.. మహిళ జుట్టు పట్టుకుని రోడ్డు పై ఈడ్చుకెళ్లి.. దారుణంగా కొట్టి
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?