Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఘాతుకం.. రూ.1.9 కోట్ల కోసం భార్య హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Man Kills Wife To Get ₹ 1.90 Crore Insurance Amount: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యనే హత్య చేసి బీమా డబ్బులు పొందాలని పథకం వేశాడు. అయితే మరణంపై అనుమానం రావడంతో ఈ కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.9 కోట్లు వస్తాయనే ఆశతో ఆమెను కిరాయి వ్యక్తితో హత్య చేయించాడు. ఆమె ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు.
బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు. అక్టోబర్ 5న ఈ ఘటన జరిగింది. భర్త మహేష్ చంద్, తన భార్య షాటును హత్య చేయించాడు. మహేష్ చంద్ అభ్యర్థన మేరకు షాలు తన బంధువైన రాజుతో కలిసి బైకుపై గుడికి వెళ్తుండగా తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో వారి బైకును కారుతో ఢీకొట్టించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో షాలు అక్కడిక్కడే మరణించింది. ఆమె బంధువు చికిత్స పొందుతూ మరణించాడు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Gujarat Elections: గుజరాత్ తొలి పోరు నేడే.. 89 స్థానాలకు పోలింగ్
అయితే ఈ ఘటనపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. భర్త మహేష్ చంద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే భార్యను హత్య చేయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మహేష్ చంద్ తన భార్య పేరుతో 40 ఏళ్లకు గానూ బీమా చేయించాడు. సహజమరణం పొందితే రూ. 1 కోటి, ప్రమాదంలో మరణిస్తే రూ.1.9 కోట్లు వచ్చేలా ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ డబ్బు కోసమే భార్య షాలును హత్య చేయించాడు. ఈ హత్య కోసం రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోడ్ తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా రూ. 5.5 లక్షలు ఇచ్చాడు మహేష్ చంద్.
మహేష్ చంద్, షాలులకు 2015లో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తే కూడా ఉంది. అయితే పెళ్లయిన రెండేళ్ల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. 2016లో మహేష్ చంద్ పై గృహహింస కేసు కూడా పెట్టింది షాలు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో భార్య పేరుతో ఇన్సూరెన్స్ చేశాడు మహేష్. అయితే తాను ఓ కోరిక కోరానని.. అది నెరవేరాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా 11 రోజుల పాటు హనుమాన్ మందిరానికి వెళ్లాలని భార్య షాలుకు చెప్పాడు మహేష్ చంద్. తన కోరిక నెరవేరగానే ఆమెను ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాడు. భర్త మాటలను నమ్మిన భార్య గుడికి వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి చంపించాడు మహేష్. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు కారు యజమానులు రాకేష్ సింగ్, సోనూలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!