Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఘాతుకం.. రూ.1.9 కోట్ల కోసం భార్య హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Man Kills Wife To Get ₹ 1.90 Crore Insurance Amount: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యనే హత్య చేసి బీమా డబ్బులు పొందాలని పథకం వేశాడు. అయితే మరణంపై అనుమానం రావడంతో ఈ కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.9 కోట్లు వస్తాయనే ఆశతో ఆమెను కిరాయి వ్యక్తితో హత్య చేయించాడు. ఆమె ప్రయాణిస్తున్న బైకును కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు.
బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పోలీసులు. అక్టోబర్ 5న ఈ ఘటన జరిగింది. భర్త మహేష్ చంద్, తన భార్య షాటును హత్య చేయించాడు. మహేష్ చంద్ అభ్యర్థన మేరకు షాలు తన బంధువైన రాజుతో కలిసి బైకుపై గుడికి వెళ్తుండగా తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో వారి బైకును కారుతో ఢీకొట్టించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో షాలు అక్కడిక్కడే మరణించింది. ఆమె బంధువు చికిత్స పొందుతూ మరణించాడు.
Also Read
Read Also: Gujarat Elections: గుజరాత్ తొలి పోరు నేడే.. 89 స్థానాలకు పోలింగ్
అయితే ఈ ఘటనపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. భర్త మహేష్ చంద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే భార్యను హత్య చేయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మహేష్ చంద్ తన భార్య పేరుతో 40 ఏళ్లకు గానూ బీమా చేయించాడు. సహజమరణం పొందితే రూ. 1 కోటి, ప్రమాదంలో మరణిస్తే రూ.1.9 కోట్లు వచ్చేలా ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ డబ్బు కోసమే భార్య షాలును హత్య చేయించాడు. ఈ హత్య కోసం రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోడ్ తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా రూ. 5.5 లక్షలు ఇచ్చాడు మహేష్ చంద్.
మహేష్ చంద్, షాలులకు 2015లో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తే కూడా ఉంది. అయితే పెళ్లయిన రెండేళ్ల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. 2016లో మహేష్ చంద్ పై గృహహింస కేసు కూడా పెట్టింది షాలు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో భార్య పేరుతో ఇన్సూరెన్స్ చేశాడు మహేష్. అయితే తాను ఓ కోరిక కోరానని.. అది నెరవేరాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా 11 రోజుల పాటు హనుమాన్ మందిరానికి వెళ్లాలని భార్య షాలుకు చెప్పాడు మహేష్ చంద్. తన కోరిక నెరవేరగానే ఆమెను ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాడు. భర్త మాటలను నమ్మిన భార్య గుడికి వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి చంపించాడు మహేష్. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు కారు యజమానులు రాకేష్ సింగ్, సోనూలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!