Udaipur tailor Murder: కన్హయ్య లాల్ తల నరికిన కేసులో నిందితుడికి బెయిల్..నూపుర్ శర్మకి మద్దతిచ్చినందుకు హత్య..
- ఉదయ్పూర్ టైలర్ హత్య కేసులో నిందితుడికి బెయిల్..
- 2022లో సంచలనంగా కన్హయ్యలాల్ హత్య కేసు..
- నూపుర్ శర్మకి మద్దతు ఇచ్చినందుకు హత్య చేసిన మతోన్మాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udaipur tailor Murder: 2022లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిని ఉదయ్పూర్ దర్జీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. టైలర్ కన్హయ్యలాల్ని దారుణంగా హత్య చేసిన నిందితుల్లో ఒకరైన మహ్మద్ జావేద్కి రాజస్థాన్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జూలై 22, 2022న ఉదయ్పూర్లో జావేద్ని అరెస్ట్ చేసింది. జూన్ 28న తన షాపులో పనిచేసుకుంటున్న కన్హయ్య లాల్ అనే టైలర్ని అత్యంత దారుణంగా రియాజ్ అట్టారి, గౌస్ మహ్మద్ తల నరికి చంపారు. ఈ దారుణ హత్యను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడమే కాకుండా, ప్రధాని నరేంద్రమోడీని కూడా నిందితులు బెదిరించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తలును ప్రదర్శించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Rahul Gandhi: మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటి బీజేపీ నేత నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కారణంగా నిందితులు అతడిని పాశవికంగా హత్య చేశారు. నిందితులలో ఒకరైన మహ్మద్ జావేద్కి ఈ హత్యతో ప్రమేయం ఉంది. కన్హయ్య లాల్ దుకాణం ముందు రెక్కీ నిర్వహించి, అతను దుకాణంలో ఉన్న సమాచారాన్ని అట్టారి, గౌస్లకు అందించడంలో జావేద్ కీలక పాత్ర పోషించాడు. దాడికి 8 రోజుల ముందు కన్హయ్య హత్యకు పథకం రచించారు. కన్హయ్యను ఐఎస్ఐఎస్ తరహాలో తల నరికి చంపడానికి జూన్ 20న కుట్రపన్నారు. ఈ హత్యతో పాకిస్తాన్కి చెందిన దావత్ ఏ ఇస్లామీతో సంబంధం ఉన్నట్లు విచారణలో తెలిసింది. 2014లో దావత్-ఎ-ఇస్లామీ సీనియర్ కార్యకర్తలు గౌస్ మహ్మద్ను పాకిస్థాన్కు ఆహ్వానించినట్లు తేలింది. కరాచీకి చెందిన ఈ సంస్థ సున్నత్, ఖురాన్ బోధనల్ని ప్రపంచవ్యాప్తంగా షరియాను అమలు చేసే లక్ష్యంతో ఏర్పాటైంది.
తాజావార్తలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!