Rahul Gandhi: పాక్తో భారత్ యుద్ధం.. ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలన్న రాహుల్ గాంధీ
- మరోసారి విదేశాంగ మంత్రి జైశంకర్ పై మండిపడిన రాహుల్ గాంధీ..
- పాకిస్తాన్ తో యుద్ధంలో మనం ఎన్ని విమానాలు కోల్పోయామని క్వశ్చన్..
- దాడి గురించి పాక్ కు ముందస్తుగానే సమాచారం ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపణలు..
Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను అడిగారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్.. అందులో జై శంకర్ మౌనంపై ప్రశ్నలు సంధించారు. మే 7వ తేదీన జరిగిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం నేరం అని జైశంకర్పై తీవ్రంగా మండిపడ్డారు. విదేశాంగ మంత్రి నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు.. అది విపత్కరమని రాసుకొచ్చారు. అలాగే, భారత వైమానిక దళం ఈ ఆపరేషన్లో ఎన్ని విమానాలు కోల్పోయిందనే గత ప్రశ్నను మరోసారి గుర్తు చేశారు. “మరోసారి అడుగుతున్నాను” పాకిస్తాన్కు ముందే సమాచారం తెలియడంతో మనం ఎన్ని విమానాలు కోల్పోయాము?” అని జైశంకర్ని అడిగారు. ఈ ట్వీట్ రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్ట్కు కొనసాగింపుగా రాసుచ్చారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. పోలీసులకు కీలక ఆదేశాలు
Also Read
అయితే, ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రారంభానికి ముందే బహిర్గతం చేశారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పై తీవ్రంగా ఆరోపిస్తూ.. ఈ నెల 17న రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అందులో “ఇది ఒక తప్పు కాదు, ఇది నేరం. దేశం సత్యాన్ని తెలుసుకోవాలి,” అని రాసుకొచ్చారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడుల గురించి ముందస్తు హెచ్చరిక ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వాదించారు. భారత విదేశాంగ మంత్రి “మన దాడి గురించి ముందస్తుగానే పాక్ కు సమాచారం ఇచ్చినట్లు పబ్లిక్గా అంగీకరించారని వెల్లడించారు. ఈ చర్యకు ఎవరు అధికారం ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ యుద్ధం ఫలితంగా మనం ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేశారు.
EAM Jaishankar’s silence isn’t just telling — it’s damning.
So I’ll ask again: How many Indian aircraft did we lose because Pakistan knew?
This wasn’t a lapse. It was a crime. And the nation deserves the truth. https://t.co/izn4LmBGJZ
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2025
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!