Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- ఆల్గోరిథం మార్చాల్సిందే, డీప్ఫేక్, తప్పుడు ప్రచారం అరికట్టాల్సిందే..
- మెటాకు కేంద్రం అల్టిమేటం..
- ప్రాపంగండా కంటెంట్ అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్మ్యాప్ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన సమావేశంలో కంపెనీ ప్రస్తుత కంటెంట్ మోడరేషన్ వ్యవస్థ, హానికర కంటెంట్ను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై చర్చించారు.
ప్రాపంగండా కంటెంట్, డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఇమేజెస్, చట్టవిరుద్ధం కంటెంట్ వ్యాప్తిని తగ్గించేలా ఆల్గోరిథంలో మార్పులు చేయాలని ప్రభుత్వం మెటాకు సూచించింది. భారత డేటా లోకలైజేషన్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, దీని అర్థం భారత యూజర్ల డేటాను భారత్ లోని సర్వర్లలో నిల్వ చేయడం లేదా దాని కాపీని భారత్లో ఉండచం చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ అధికార సంస్థల గురించి అభ్యంతరకర కంటెంట్ను వేగంగా తొలగించాలని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల క్విక్ రెస్పాన్స్ టీమ్ల (QRTs)తో మెటా నేరుగా సమన్వయం చేసుకోవాలని కేంద్రం సూచించింది. డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, ఫేక్ కంటెంట్ ను వేగంగా గుర్తించి తొలగించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన సమావేశంలో మెటా తన ఆల్గోరిథంలో లోపాలు ఉన్నట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బాధ్యతను మరింత పెంచడంతో పాటు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏఐ సాయంతో రూపొందిస్తున్న తప్పుడు కంటెంట్ను ముందుగా గుర్తించి అడ్డుకునే టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!