Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?
- పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ
- తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం
- రోడ్డుపై హైవోల్టేజీ డ్రామా నడిపిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా రోడ్డుపైనే హైవోల్టేజీ డ్రామా నడిచింది. ఆ మహిళ భాగల్పూర్లోని జీరో మైల్ లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన తన పేరెంట్స్ పై భర్త సుధాన్షు రాయ్, అతని సోదరుడు హిమాన్షు, ఇతర కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. కర్రలతో చితకబాదారు.
Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్.. వీడియో వైరల్..
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఈ ఘటన సోమవారం రాత్రి జగత్పూర్లో చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు చేరినా మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జగత్పూర్కు చెందిన సుధాన్షు రాయ్, సప్నా కుమారికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. భార్య సప్నా ఇప్పుడు మాట మారుస్తుందని భర్త చెబుతున్నాడు. అప్పుడు పానీపూరీ కోసం పెద్ద తతంగం చేసి.. ఇప్పుడు ఏసీ గురించి కథలు చెబుతుందని భర్త వాపోయాడు. ఏసీ కోసం తన భర్త, అత్తగారు తరచూ డబ్బులు అడుగుతారని ఆమె చెప్పింది. దానికి నిరాకరించడంతో ఎప్పటికీ కొట్టేవాళ్లని.. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా హింసించే వారని చెప్పింది.
Drug Quality Test: పారాసెటమాల్తో సహా 52 డ్రగ్స్ నమూనాలు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్..
మరోవైపు.. తన భార్య తన తల్లికి సేవ చేయడం ఇష్టం లేదని, ఆస్తిని ఎప్పుడు పంచుకోవాలని అనేదని భర్త చెప్పాడు. అయితే.. ఈ ఘటనపై డయల్ 112లో ఫిర్యాదు అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. పానీపూరిపై మొదలైన వివాదం ఇంట్లో గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఇంచార్జి సందీప్ కుమార్ ఆనంద్ తెలిపారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!