Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?
- పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ
- తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం
- రోడ్డుపై హైవోల్టేజీ డ్రామా నడిపిన మహిళ
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా రోడ్డుపైనే హైవోల్టేజీ డ్రామా నడిచింది. ఆ మహిళ భాగల్పూర్లోని జీరో మైల్ లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన తన పేరెంట్స్ పై భర్త సుధాన్షు రాయ్, అతని సోదరుడు హిమాన్షు, ఇతర కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. కర్రలతో చితకబాదారు.
Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్.. వీడియో వైరల్..
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ఈ ఘటన సోమవారం రాత్రి జగత్పూర్లో చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు చేరినా మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జగత్పూర్కు చెందిన సుధాన్షు రాయ్, సప్నా కుమారికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. భార్య సప్నా ఇప్పుడు మాట మారుస్తుందని భర్త చెబుతున్నాడు. అప్పుడు పానీపూరీ కోసం పెద్ద తతంగం చేసి.. ఇప్పుడు ఏసీ గురించి కథలు చెబుతుందని భర్త వాపోయాడు. ఏసీ కోసం తన భర్త, అత్తగారు తరచూ డబ్బులు అడుగుతారని ఆమె చెప్పింది. దానికి నిరాకరించడంతో ఎప్పటికీ కొట్టేవాళ్లని.. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా హింసించే వారని చెప్పింది.
Drug Quality Test: పారాసెటమాల్తో సహా 52 డ్రగ్స్ నమూనాలు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్..
మరోవైపు.. తన భార్య తన తల్లికి సేవ చేయడం ఇష్టం లేదని, ఆస్తిని ఎప్పుడు పంచుకోవాలని అనేదని భర్త చెప్పాడు. అయితే.. ఈ ఘటనపై డయల్ 112లో ఫిర్యాదు అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. పానీపూరిపై మొదలైన వివాదం ఇంట్లో గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఇంచార్జి సందీప్ కుమార్ ఆనంద్ తెలిపారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?