Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?
- పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ
- తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం
- రోడ్డుపై హైవోల్టేజీ డ్రామా నడిపిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా రోడ్డుపైనే హైవోల్టేజీ డ్రామా నడిచింది. ఆ మహిళ భాగల్పూర్లోని జీరో మైల్ లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన తన పేరెంట్స్ పై భర్త సుధాన్షు రాయ్, అతని సోదరుడు హిమాన్షు, ఇతర కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. కర్రలతో చితకబాదారు.
Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్.. వీడియో వైరల్..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఈ ఘటన సోమవారం రాత్రి జగత్పూర్లో చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు చేరినా మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జగత్పూర్కు చెందిన సుధాన్షు రాయ్, సప్నా కుమారికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. భార్య సప్నా ఇప్పుడు మాట మారుస్తుందని భర్త చెబుతున్నాడు. అప్పుడు పానీపూరీ కోసం పెద్ద తతంగం చేసి.. ఇప్పుడు ఏసీ గురించి కథలు చెబుతుందని భర్త వాపోయాడు. ఏసీ కోసం తన భర్త, అత్తగారు తరచూ డబ్బులు అడుగుతారని ఆమె చెప్పింది. దానికి నిరాకరించడంతో ఎప్పటికీ కొట్టేవాళ్లని.. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా హింసించే వారని చెప్పింది.
Drug Quality Test: పారాసెటమాల్తో సహా 52 డ్రగ్స్ నమూనాలు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్..
మరోవైపు.. తన భార్య తన తల్లికి సేవ చేయడం ఇష్టం లేదని, ఆస్తిని ఎప్పుడు పంచుకోవాలని అనేదని భర్త చెప్పాడు. అయితే.. ఈ ఘటనపై డయల్ 112లో ఫిర్యాదు అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. పానీపూరిపై మొదలైన వివాదం ఇంట్లో గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఇంచార్జి సందీప్ కుమార్ ఆనంద్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!