QR code scam: రామమందిరం పేరిట భక్తుల్ని లూటీ చేస్తున్న “క్యూఆర్ కోడ్ స్కామ్”.. వీహెచ్పీ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహా రామాలయ సంప్రోక్షణకు కొన్ని వారాలే సమయం ఉండగా.. భక్తులను మోసం చేస్తూ, వారి నుంచి నకిలీ విరాళాలు సేకరిస్తున్న రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ ‘విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కోరింది. ఈ మోసానికి గురికావద్దని ప్రజలను కోరుతూ.. సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసింది.
వీహెచ్పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ ట్వీట్ చేస్తూ.. “శ్రీ రామ జన్మభూమి తీర్థ ఛేత్రా అయోధ్య, ఉత్తరప్రదేశ్” పేరుతో ఒక నకిలీ సోషల్ మీడియా పేజీని సృష్టించినట్లు వెల్లడించారు. క్యూఆర్ కోడ్తో కూడిన పేజీని, రామ మందిర నిర్మాణం పేరుతో నిధులనున అందించమని భక్తుల్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మోసం గురించి ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు వెల్లడించారు.
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
Read Also: New Year 2024: న్యూఇయర్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?
రామాలయం పేరుతో విరాళాలనున కోరిన వ్యక్తి, మీకు చేతనైనంత విరాళం ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు విరాళం ఇచ్చిన వారి పేర్లు డైరీలో నమోదు చేసుకుని, ఆలయం పూర్తైన తర్వాత అయోధ్యకు ఆహ్వానిస్తానని నమ్మబలుకుతున్నారు. అంతే కాకుండా ‘‘ ముస్లిం సమాజం, హిందూ సమాజానికి మధ్య పోరాటం జరుగుతోందని తెలుసు, ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతించడం లేదని, అందుకే తమ ఆలయం కోసం నిధులు సేకరిస్తున్నాం’’ అంటూ మోసగాళ్లు ప్రజల్ని లూటీ చేస్తున్నారు. రామ మందిరం పేరులో ప్రజల మధ్య విభేదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
రామమందిరం పేరిట నిధులు సేకరించేందుకు ఎవరికీ అధికారం లేదని, ప్రజలు ఇలాంటి మోసాలకు గురికావద్దని వీహెచ్పి చెప్పింది. దీనిపై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్కి లేఖ రాసినట్లు తెలిపింది.
सावधान..!!
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के नाम से फर्जी आईडी बना कर कुछ लोग पैसा ठगी का प्रयास कर रहे हैं। @HMOIndia @CPDelhi @dgpup @Uppolice को ऐसे लोगों के विरूद्ध विलम्ब कार्यवाही करनी चहिए। @ShriRamTeerth has not authorised any body to collect funds for this occasion. pic.twitter.com/YHhgTBXEKi— विनोद बंसल Vinod Bansal বিনোদ বনসল వినోద్ బన్సాల్ (@vinod_bansal) December 31, 2023
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!