Priyanka Gandhi: “రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం”.. ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 సీట్లకు గానూ 136 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 65 స్థానాల్లో గెలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇప్పుడంతా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య 2024లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Read Also: Bengaluru City: బెంగళూరు సిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.. అర్బన్లో బీజేపీ డీలా..
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా చేయాలని పార్టీ నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. ‘‘ప్రజలే భవిష్యత్తును నిర్ణయిస్తారు’’ అని అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశమని అభివర్ణించిన సిద్ధరామయ్య, వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఇది గీటురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీయేతర పార్టీలన్నింటి ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తానని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని ఆశిస్తున్నాని సిద్దరామయ్య అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలనే పెరుగుతున్న వినతుల నేపథ్యంలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద బాధ్యత అని, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజల కోసం పనిచేయాలి, తర్వాత ఏం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె వ్యాఖ్యానించింది. ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు ఇకపై దేశంలో పనిచేయవని, హిమాచల్ లో చూశాం, కర్ణాటకలో ఇదే తెలిసిందని, ప్రజలు తమ సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!