Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress Wins 17 Seats In Bengaluru City

Bengaluru City: బెంగళూరు సిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.. అర్బన్‌లో బీజేపీ డీలా..

Published Date :May 13, 2023 , 10:25 pm
By Sudhakar Ravula
Bengaluru City: బెంగళూరు సిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.. అర్బన్‌లో బీజేపీ డీలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bengaluru City: భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా అర్బన్‌లో బలమైన ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతారు.. కానీ, కొన్నిసార్లు అది తారుమారు అవుతుంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కీలంగా ఉన్న బెంగళూరు సిటీలో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది.. బెంగళూరు సిటీలో మొత్తం 32 నియోజకవర్గాలు ఉంటే.. అందులో 17 సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్‌.. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే అంకేల్‌ సెగ్మెంట్‌ను బి.శివన్న 31 వేల 325 ఓట్ల ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు. బీటీఎం లేఅవుట్‌ స్థానంలో రామలింగారెడ్డి 9 వేల 222 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చామరాజ్‌పేటలో జమీర్‌ అహ్మద్‌ఖాన్ 53 వేల 953 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గాంధీనగర్‌లో దినేష్‌ గుండూరావ్‌ కేవలం 105 ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. గోవిందరాజ నగర్‌లో ప్రియకృష్ణకు 12 వేల 516 ఓట్ల మెజార్టీ వచ్చింది. హెబ్బళ్‌లో బి.ఎస్ సురేష 30 వేల 754 మెజార్టీతో విజయం సాధించారు. జయనగర్‌ నుంచి సౌమ్య రెడ్డి కేవలం 294 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సీఎం రేస్‌లో ఉన్న డీకే శివకుమార్‌ కనకపురలో లక్షా 22 వేల 392 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కునిగల్‌లో డాక్టర్‌ రంగనాథ్‌కు 26 వేల 573 ఓట్ల మెజార్టీ దక్కింది. మగదిలో హెచ్‌.సి. బాలకృష్ణకు 11 వేల 839 మెజార్టీ వచ్చింది. పులకేసి నగర్‌లో ఎ.సి.శ్రీనివాస 62 వేల 210 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామ నగరంలో ఇక్బాల్‌ హుస్సేన్‌కు 10 వేల 715 ఓట్ల ఆధిక్యం దక్కితే, సర్వ నగర్‌లో కె.జె.జార్జ్‌కు 55 వేల 768 మెజార్టీ లభించింది. శాంతి నగర్‌లో ఎన్‌.ఎ.హారిస్ 7 వేల 125 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శివాజీ నగర్‌లో రిజ్వాన్‌ అర్షద్‌ 23 వేల 194 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయ నగర్‌లో ఎం.కృష్ణప్పకు 7 వేల 324 ఓట్ల మెజార్టీ దక్కింది.

ఇక, బెంగళూరు సిటీలో కమలనాథులు 14 సీట్లకే పరిమితయ్యారు. మూడు సెగ్మెంట్లలో 50వేలకు పైగా ఓట్ల మెజార్టీ దక్కింది. బెంగళూరు సౌత్‌లో ఎం.కృష్ణప్ప 49 వేల 699 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బసవన్నగుడి స్థానాన్ని రవి సుబ్రహ్మణ్య 54వేల 978 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. బొమ్మనహళ్లి నుంచి ఎం. సతీష్‌ రెడ్డి 24 వేల 215 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సి.వి.రామనగర్‌లో ఎస్‌.రఘుకు 16 వేల 395 ఓట్ల మెజార్టీ దక్కింది. చిక్‌పెట్‌లో ఉదయ్‌ గరుదచర్ 12వేల 113 ఓట్లు, దసరహళ్లిలో మునిరాజ్ 9వేల 194 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కె.ఆర్‌.పురలో బి.ఎ.బసవరాజకు 24 వేల 301 ఓట్ల మెజార్టీ కట్టబెట్టారు ఓటర్లు. మహదేవపురలో ఎస్‌.మంజుల 44 వేల 501 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మహాలక్ష్మి లేఅవుట్ సెగ్మెంట్‌లో కె.గోపాలయ్య 51 వేల 165 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొమ్మై కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ అశ్వత్ నారాయణ మల్లేశ్వరంలో 41 వేల 302 ఓట్ల ఆధిక్యం కనబర్చారు.పద్మనాభ నగర్‌లో ఆర్. అశోక 55 వేల 175 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ నగర్‌లో ఎస్.సురేష్‌ కుమార్‌కు 8 వేల 60 ఓట్ల ఆధిక్యం దక్కింది. రాజరాజేశ్వరి నగర్‌లో మునిరత్న 11వేల 842 ఓట్ల మెజార్టీ సాధించారు. యశ్వంత్‌పురలో ఎస్‌.టి.సోమశేఖర్‌ 15 వేల 118 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. మరోవైపు.. బెంగళూరు సిటీ చన్నపట్న నియోజకవర్గంలో పోటీచేసిన జేడీఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేవలం 15 వేల 915 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. కుమారస్వామి చేతిలో బీజేపీ అభ్యర్థి యోగేశ్వర ఓడిపోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru city
  • congress
  • karnataka election results 2023
  • Karnataka Polls 2023

తాజావార్తలు

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions